Malaysia Missing Flight: పదేళ్ల క్రితం మిస్సైన మలేషియా విమానం మిస్టరీ.!

మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్‌ 370 అదృశ్యమై పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ విమానం మిస్సింగ్‌ ఒక మిస్టరీగా మిగిలింది. దీనికి సంబంధించి పలు కథనాలు వార్తల రూపంలో తెరపైకి వస్తునే ఉన్నాయి. మార్చి 8, 2014న మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి చైనాలోని బీజింగ్‌కు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్‌ 370 అదృశ్యమైంది.

Malaysia Missing Flight: పదేళ్ల క్రితం మిస్సైన మలేషియా విమానం మిస్టరీ.!

|

Updated on: Mar 15, 2024 | 9:52 PM

మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్‌ 370 అదృశ్యమై పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ విమానం మిస్సింగ్‌ ఒక మిస్టరీగా మిగిలింది. దీనికి సంబంధించి పలు కథనాలు వార్తల రూపంలో తెరపైకి వస్తునే ఉన్నాయి. మార్చి 8, 2014న మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి చైనాలోని బీజింగ్‌కు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్‌ 370 అదృశ్యమైంది. ఈ విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నాలు చేసినప్పటికీ, విమానం విడి భాగాలు గానీ, దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను గానీ కనుక్కోలేకపోయారు. ప్రమాద సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం కౌలాలంపూర్‌లో టేకాఫ్‌ అయ్యాక 39 నిమిషాల తర్వాత ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సిగ్నల్‌ కోల్పోయి అదృశ్యమైంది. విమానం అదృశ్యంపై పరిశోధన చేసిన బృందంలోని సభ్యుడైన బ్రిటన్‌ ఏవియేషన్‌ నిపుణుడు, పైలట్ సైమన్ హార్డీ తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. దీనిపై పరిశోధన చేసిన హారీ.. ఈ విమాన అదృశ్యం.. సదరు పైలట్‌ జహారీ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకోవాలనే పథకంలో భాగంగానే జరిగినట్లు వెల్లడించారు.

ఎంహెచ్‌ 370 విమానం పైలట్‌ జహారీ అహ్మద్ షా.. తన ఆత్మహత్య పథకంలో ప్రయాణికులను భాగం చేసినట్లుగా.. ఆ స్కెచ్ ప్రకారమే విమానాన్ని అదృశ్యం చేసినట్లు సైమన్‌ హార్డీ తెలిపారు. ప్రమాద సమయంలో దక్షిణ హిందూ సముద్రంలో గీల్విన్క్ ఫ్రాక్చర్‌ జోన్‌లో విమానం అదృశ్యం చేసేలా పైలట్‌ ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ పరిశోధనలో కూడా ఇలాంటి ముగింపు వచ్చినట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us