వెంకన్న ఆలయంలో భారీ చోరీ..తాళాలు పగలగొట్టి వీడియో
శ్రీకాకుళం జిల్లా పలాసలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి దొంగలు సీసీ కెమెరాలను తొలగించి, తాళాలు పగలగొట్టి గర్భగుడిలోని రూ.9 లక్షల బంగారు ఆభరణాలతో పాటు హుండీల నుంచి నగదును అపహరించారు. మొత్తం రూ.50 లక్షలకు పైబడి సొత్తు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇటీవల పోలీస్ పికెటింగ్ ఎత్తేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరిగింది.
శ్రీకాకుళం జిల్లా పలాసలోని “చిన్న తిరుపతి”గా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాల వైర్లు తొలగించి, ఆలయం తాళాలు పగలగొట్టి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. గర్భాలయంలోని వెంకన్న మూల విరాట్కు అలంకరించిన సుమారు తొమ్మిది లక్షల రూపాయల విలువ చేసే బంగారు నామాలు, వెండి కిరీటం, కవచం, పాదాలు, చేతులు, కళ్లతో పాటు, రెండు హుండీలలో ఉన్న నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. మొత్తం మీద సుమారు యాభై లక్షల రూపాయలకు పైబడి నగదు, సొత్తు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు హరి ముకుంద పండా వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్… మెగాస్టార్కి ఊరట!
సందీప్ని గుర్తుచేసిన గీతూ…అంతకు మించి అంటున్న ఆడియన్స్
పండగపూట భగ్గుమంటున్న చికెన్, మటన్ ధరలు
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
Follow Us
వైరల్ వీడియోలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

