సమాధుల వద్ద పోలీసులతో భద్రత.. అక్కడ అత్యవసర పరిస్థితి !!

|

Apr 13, 2024 | 11:45 AM

జాతుల వైరం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంతో అల్లాడే పశ్చిమాఫ్రికా దేశం సియెర్రా లియోన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. జాంబీ డ్రగ్‌కు బానిసలుగా మారిన యువకులు యథేచ్ఛగా సమాధులు తవ్వి ఎముకలను పట్టుకుపోతుండడం కలకలం రేపుతోంది. దీంతో సమాధులన్నీ ఖాళీ అవుతుండడంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించింది. నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉండడం, వ్యసనాలవైపు యువత మళ్లడంతో పరిస్థితులు అదుపుతప్పాయి.

జాతుల వైరం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంతో అల్లాడే పశ్చిమాఫ్రికా దేశం సియెర్రా లియోన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. జాంబీ డ్రగ్‌కు బానిసలుగా మారిన యువకులు యథేచ్ఛగా సమాధులు తవ్వి ఎముకలను పట్టుకుపోతుండడం కలకలం రేపుతోంది. దీంతో సమాధులన్నీ ఖాళీ అవుతుండడంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించింది. నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉండడం, వ్యసనాలవైపు యువత మళ్లడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీనికితోడు 2018లో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ‘కుష్’ అనే జాంబీడ్రగ్ చాప కింద నీరులా దేశమంతా పాకిపోయింది. ఈ జాంబీ డ్రగ్‌ను గంజాయి, టెంటానైల్ వంటి మత్తుపదార్థాలు, మనిషి ఎముకలతో తయారుచేస్తారు. దీనిని కొద్దిగా తీసుకున్నా సరే కొన్ని గంటలపాటు మత్తులో మునిగి తేలేలా చేస్తుంది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు అవయవాల వాపు, అంతర్గత రక్తస్రావం వంటి వాటికీ కారణం అవుతోంది. 25 ఏళ్ల లోపు ఉన్న యువత ఎక్కువ దీనికి బానిసలుగా మారుతున్నారు. దీని వల్ల ఇప్పటికే వందలాదిమంది మరణించినట్టు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్‌.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు

Heart Attack: మహిళలూ మీ గుండెలు జర భద్రం.. తాజా అధ్యయనాల్లో వెల్లడి

కిక్కిచ్చే న్యూస్.. హృతిక్ NTR మధ్య భీకర డ్యాన్స్‌ పోటీ..

భార్యకు నచ్చలేదని.. కోట్లు విలువ చేసే కారును లైట్‌ తీసుకున్న హీరో

Akhil Akkineni: నయా లుక్‌లో అందరికీ షాకిచ్చిన అఖిల్

Follow us on