Variety Gifts: చదివింపుల విందులో షాకింగ్ కానుకలు.. ఏకంగా రూ.15 కోట్లు వసూలు.! అబ్బురపరిచే వీడియో..
తమిళనాడులోని పుదుక్కోట్టైలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామంలో నిర్వహించిన విందులో కార్యక్రమంలో రికార్డ్ స్థాయిలో చదివింపులు వచ్చాయి. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా..
తమిళనాడులోని పుదుక్కోట్టైలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామంలో నిర్వహించిన విందులో కార్యక్రమంలో రికార్డ్ స్థాయిలో చదివింపులు వచ్చాయి. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా.. విందులో అక్షరాల 15కోట్ల రూపాయలు వసూలయ్యాయి. దీంతో ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెడువాసల్ కిళక్కు గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. విందుకు హాజరైనవారంతా అక్కడ సిద్ధంగా ఉంచిన పాత్రల్లో తమకు తోచినంత నగదు చదివింపులుగా వేశారు. ఇలా వచ్చిన నగదును నిర్వాహకులు లెక్కించగా, 15కోట్ల వరకు వసూలైనట్లు ప్రకటించారు. అయితే ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటారు తమిళనాడు వాసులు. పుదుక్కోట్టై జిల్లా కీరామంగళం తాలూకాలోని వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే రైతు వ్యవసాయంలో నష్టపోయి ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో కష్టాల నుంచి గట్టెక్కేందుకు విందు ఏర్పాటుచేసి సుమారు 50వేల ఆహ్వాన పత్రికలను ముద్రించాడు. బంధువులు, స్నేహితులు, స్థానికులతో పాటు ఇతర గ్రామాల్లోనూ పంచాడు. 15 లక్షల రూపాయలు ఖర్చుచేసి రకరకాల ఆహార పదార్థాలు తయారుచేయించాడు. సుమారు 5వేల మంది అతిథులకు ఆప్యాయంగా వడ్డించాడు. కృష్ణమూర్తి ఆతిథ్యంతో ఖుషీ అయిన అతిథులు కళ్లు చెదిరే రీతిలో చదివింపులు చెల్లించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

