భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త..ఆ వెబ్ సిరీస్ చూసే ఇలా చేశాడా! వీడియో
హైదరాబాద్లోని మీర్పేటలో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి మరో మహిళతో కలిసి ఉండేందుకే తన భార్యను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఓ వెబ్ సిరీస్ ప్రేరణతో తన భార్యను కిరాతకంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. భార్యను హత్య చేసి, ముక్కలుగా నరికి, శరీర భాగాలను బకెట్ నీళ్లలో వేసి హీటర్తో ఉడికించి మాంసాన్ని ముద్దగా చేసి చెరువులో వేశాడు. నిందితుడి ఫోన్ను పరిశీలించగా మరో మహిళతో ఉన్న ఫొటోలు లభ్యమయ్యాయి. ఈ దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.
ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన గురుమూర్తికి, 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో వివాహమైంది. గురుమూర్తి ఆర్మీలో జవాన్గా పని చేసి నాయక్ సుబేదార్గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్భాగ్ డీఆర్డీవోలో కాంట్రాక్ట్ పద్దతిలో భద్రతా విభాగంలో పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా అతను మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. విషయం మాధవికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో గురుమూర్తి తన భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా తన ఇద్దరు పిల్లలను హైదరాబాద్లోనే ఉండే తన సోదరి ఇంటికి పంపించాడు. ఈ నెల 15న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో భార్య తలను గోడకేసి కొట్టాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఓ వెబ్ సిరీస్లో ఉన్నట్లుగా మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకువెళ్లి ముక్కలుగా నరికాడు.
సూట్కేసులో నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూడగా షాక్
వామ్మో.. ఒక్కపీత ఖరీదు నాలుగు వేలా ??
ఇది తల్లి ప్రేమ మాత్రమే కాదు.. అంతకు మించి!
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి వీడియో
బ్యాంకునుంచి నగదు డ్రా చేస్తున్నారా..జాగ్రత్త వీడియో
ఉగ్ర ముఠా టార్గెట్ అవేనా? వీడియో
ఈ పెట్టె వెనుక పెద్ద చరిత్రే ఉంది.. దొంగలూ ఎత్తుకెళ్లలేరు వీడియో

