బంగారు నాణేలు తీసుకుని ఇంటికి చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. క్షణాల్లో కళ్లు తేలేశాడు !!

|

Oct 10, 2022 | 8:49 AM

ఓ వ్యాపారి దగ్గర నుంచి ఓ వ్యక్తి బంగారు నాణేలు కొనుగోలు చేశాడు. ఎంతో ఆనందంగా వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. సీన్ కట్ చేస్తే.. క్షణాల్లో అతడు కళ్లు తేలేశాడు..

ఓ వ్యాపారి దగ్గర నుంచి ఓ వ్యక్తి బంగారు నాణేలు కొనుగోలు చేశాడు. ఎంతో ఆనందంగా వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. సీన్ కట్ చేస్తే.. క్షణాల్లో అతడు కళ్లు తేలేశాడు.. అసలేం జరిగిందంటే.. స్వచ్చమైన బంగారం అంటూ నకిలీ బంగారంతో మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తున్నాయి. దీనిపై పోలీసులు ఎంతగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో బయటపడింది. స్థానికంగా నివాసముంటున్న మురళీధరన్ అనే వ్యక్తిని ఓ మోసగాడు స్వచ్చమైన బంగారు నాణేలు అనే పేరుతో 30 లక్షల రూపాయలకు టోకరా వేశాడు. అయితే కొద్ది గంటల్లోనే తాను మోసపోయాయని గ్రహించాడు మురళీధరన్. అవి నకిలీ గోల్డ్‌ కాయిన్స్‌ అని తెలుసుకున్న బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే సరిహద్దు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రెడ్ హ్యాండెడ్‌గా నిందితుడిని అరెస్ట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భక్తిపారవశ్యం.. వీళ్లు ఏం చేశారో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ

మ‌హిళ స్టెప్పుల‌కు అనుగుణంగా గేదె డ్యాన్స్.. వీడియో వైర‌ల్

ఆకాశంలో చక్కర్లు కొట్టిన డ్రాగన్‌ !! ఆశ్చర్య పోయిన కోట్లాదిమంది నెటిజన్లు !!

బాగా హైట్‌ ఉన్న ఈ పిల్లి .. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది

 

Follow us on