Viral Video: వేడివేడిగా పూరి ఆర్డర్.. సర్వ్ చేసింది చూసి షాక్ !!
టిఫిన్ తిందామని పూరీ ఆర్డరిస్తే… అందులో పురుగులొచ్చాయి.. ఓ కస్టమర్ ఇచ్చిన కంప్లయింట్తో ఒకటీ, రెండు కాదు.. కస్టమర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నాలుగు రెస్టారెంట్లు మూతపడ్డాయి.
టిఫిన్ తిందామని పూరీ ఆర్డరిస్తే… అందులో పురుగులొచ్చాయి.. ఓ కస్టమర్ ఇచ్చిన కంప్లయింట్తో ఒకటీ, రెండు కాదు.. కస్టమర్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నాలుగు రెస్టారెంట్లు మూతపడ్డాయి. చెన్నైలోని ఓ మాల్లో కొందరు రెస్టారెంట్కు వెళ్లారు. పూరీ ఆర్డర్ ఇచ్చారు. అయితే.. అందులో పురుగులు కనిపించాయి. ఇదేంటని రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. అటునుంచి సమాధానం రాలేదు. దీంతో కస్టమర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు చేశారు. పూరీ పిండిని చెక్ చేయడంతో పిండిలోనే పురుగులు ఉండటం చూసి అధికారులు కంగుతిన్నారు. వాటిలో కొన్ని బతికే ఉన్నాయి. మరికొన్ని చచ్చిపోయి పూరీలో కలిసిపోయాయి. మరీ ఇంత దారుణంగా పూరీలు చేస్తున్నారా అంటూ ఆ రెస్టారెంట్ని సీజ్ చేశారు అధికారులు. కథ ఇంతటితో ఆగలేదు. ఒక రెస్టారెంట్నే కాదు.. ఆ మాల్లో ఉన్న మిగతా రెస్టారెంట్లలోనూ తనిఖీలు చేశారు. అన్ని చోట్ల పురుగుల పూరీ పిండే కనిపించింది. పది రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తే.. నాలుగింటిలో వరెస్ట్ ఫుడ్ కనిపించింది. కుళ్లిన మాంసం, పాడైపోయిన భోజనం దొరకడంతో నాలుగు రెస్టారెంట్లను సీజ్ చేశారు. వాటి యజమానులకు నోటీసులు జారీ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi Birthday: బర్త్డే విషెస్ అంటే ఇది.. వింటే విజిల్స్ పడాల్సిందే
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

