వలలో చిక్కిన భారీ చేప.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే కళ్లు జిగేల్ !!
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి పంట పండింది. సముద్రంలో వల విసరగా.. భారీ చేప ఒకటి గాలానికి చిక్కింది. ఇక ఆ చేప వేలం పాటలో ఏకంగా భారీ ధరకు అమ్ముడుపోయింది.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరికి పంట పండింది. సముద్రంలో వల విసరగా.. భారీ చేప ఒకటి గాలానికి చిక్కింది. ఇక ఆ చేప వేలం పాటలో ఏకంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. కోనసీమ జిల్లాలోని ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. అది అక్షరాల 2 లక్షలకు వేలంలో అమ్ముడైంది. దీంతో పండగ చేసుకుంటున్నాడు మత్స్యకారుడు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన మత్స్యకారుడి వలకు కచిడి అనే మగ చేప చిక్కింది. దీన్ని అంతర్వేది మినీ హార్బర్లో వేలం పాట పెట్టగా.. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యాపారి 2 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ చేపలోని పొట్ట భాగాన్ని మందులలో ఉపయోగిస్తారని అందువల్ల ఈ చేప ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుందని వ్యాపారి చెబుతున్నారు. ఈ చేప 23 కేజీల బరువుంది. ఖరీదైన చేప వలకు చిక్కడంతో తన పంట పండినట్టయిందని మత్స్యకారుడు తెగ సంబరపడిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లితో మసాజ్ మామూలుగా ఉండదు.. ఛార్జీ ఎంత అని అడుగుతున్న నెటిజన్లు
ఇతని డ్రైవింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే !! దెయ్యం కంట్రోల్ చేస్తుందంటున్న నెటిజెన్స్
Viral: ఈ అంకుల డ్యాన్స్ ఎవరైన ఫిదా కావాల్సిందే..
మూత్రంలో రక్తం పోతుందని డాక్టర్ని కలిసిన వ్యక్తి.. పరీక్ష చేసిన వైద్యులకు షాక్
ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

