Crime Video: కుటుంబసభ్యుల ముందే.. ముగ్గురిపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత కూడా..! వైరల్

Updated on: Sep 25, 2023 | 8:57 AM

కామాంధులు మృగాళ్ళుగా రెచ్చిపోయారు. తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి ఇంట్లోని నగదు, నగలతో పారిపోయారు. ఈ దారుణ ఘటన హర్యానాలో వెలుగుచూసింది. సంచలనం రేపుతోన్న ఈ ఘటన పానిపట్‌లో ప్రాంతంలో సెప్టెంబర్ 21 రాత్రి జరిగింది. మట్లౌడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

కామాంధులు మృగాళ్ళుగా రెచ్చిపోయారు. తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారి ఇంట్లోని నగదు, నగలతో పారిపోయారు. ఈ దారుణ ఘటన హర్యానాలో వెలుగుచూసింది. సంచలనం రేపుతోన్న ఈ ఘటన పానిపట్‌లో ప్రాంతంలో సెప్టెంబర్ 21 రాత్రి జరిగింది. మట్లౌడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో కత్తులు, పదునైన ఆయుధాలతో ఇంటిలోకి చొరబడ్డారు దుండగులు. కుటుంబసభ్యులను తాళ్లతో బంధించారు. అనంతరం మహిళలపై నలుగురు దుండగులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన జరిగిన కిలోమీటరు దూరంలో మరో మహిళపై కూడా దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు దంపతుల ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి భర్తను తాళ్లతో బంధించి.. ఆమెను మృగాళ్లు తీవ్రంగా హింసించి పశువుల్లా ప్రవర్తించారు. తీవ్ర గాయాలతో బాధితురాలు మృతిచెందింది. ఈ రెండు ఘటనల్లో నిందితులు ఒకరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు ఘటనలు ఒక గ్రామంలోనే చోటుచేసుకున్నాయని మట్లౌడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు.. దుండగుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..