పని మనిషిలా వస్తుంది.. ఇల్లంతా దోచేస్తుంది
వృద్ధులే ఆమె టార్గెట్. తీయని మాటలు చెప్పి వారితో పరిచయం పెంచుకుంటుంది. పెద్ద వారంటే ఎంతో గౌరవం అన్నట్టు తన బిహేవియర్తో బుట్టలో వేసుకుంటుంది. వంట, ఇతర పనుల్లో సాయంగా ఉంటానంటూ నెమ్మదిగా ఇంట్లో పాగా వేస్తుంది. అదును చూసి యజమానులకు ఆహారం, పానీయాల్లో నిద్రమాత్రలు కలిపి బంగారం, నగదు అందినకాడికి దోచుకుని పరారవుతుంది. ఇలా తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 18 దొంగతనాలకు పాల్పడింది.
వృద్ధులే ఆమె టార్గెట్. తీయని మాటలు చెప్పి వారితో పరిచయం పెంచుకుంటుంది. పెద్ద వారంటే ఎంతో గౌరవం అన్నట్టు తన బిహేవియర్తో బుట్టలో వేసుకుంటుంది. వంట, ఇతర పనుల్లో సాయంగా ఉంటానంటూ నెమ్మదిగా ఇంట్లో పాగా వేస్తుంది. అదును చూసి యజమానులకు ఆహారం, పానీయాల్లో నిద్రమాత్రలు కలిపి బంగారం, నగదు అందినకాడికి దోచుకుని పరారవుతుంది. ఇలా తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాల్లో 18 దొంగతనాలకు పాల్పడింది. గతంలో పది కేసుల్లో శిక్ష పడి జైలుకు వెళ్లినా మళ్లీ అదే తీరు. డీఎస్పీ భవ్యకిషోర్ సోమవారం కేసు వివరాలను రాజమహేంద్రవరంలో వెల్లడించారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జికి వివాహం అయి, భర్త మరణించాడు. ప్రస్తుతం ఆమె రాజమహేంద్రవరం లోని బొమ్మూరులో ఉంటోంది. వృద్ధులతో పరిచయం పెంచుకుని వారి ఇళ్లలో పనిమనిషిగా చేరుతుంది. నమ్మకం కుదిరిన తర్వాత కొన్నాళ్లకు అన్నం, ప్రసాదం, పానీయాల్లో మత్తు మాత్రలను అధిక మోతాదులో కలిపి నిద్రలోకి జారుకున్నాక వారి ఒంటిపై నగలతోపాటు ఇంట్లోని బంగారం, నగదు దోచుకుపోతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్కు జరిమానా
నేపాల్లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

