ఆ పురుగులొచ్చాయంటే వర్షాలకు కరవు లేనట్టే
మొన్నటివరకు భానుడు తన ప్రతాపం చూపించాడు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోయారు. మొన్నటి నుంచే వర్షాలు కురవడం మొదలైంది. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వాతావరణం చల్లచల్లగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతి తన అందాలను మనుషులకు పరిచయం చేస్తుంది. అందులో ఒకటి ఆరుద్ర పురుగులు.
మొన్నటివరకు భానుడు తన ప్రతాపం చూపించాడు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోయారు. మొన్నటి నుంచే వర్షాలు కురవడం మొదలైంది. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వాతావరణం చల్లచల్లగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతి తన అందాలను మనుషులకు పరిచయం చేస్తుంది. అందులో ఒకటి ఆరుద్ర పురుగులు. ఈ పేరు చెపితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, మనం చదువుకునే రోజుల్లో స్కూళ్లకి వెళ్లే సమయంలో ఇలాంటి పురుగులు ఎక్కువగా కనిపించేవి. ఎర్రని ఎరుపుతో ఒళ్లంతా ఒత్తుగా సింధూరం పూసుకున్నట్టు కనబడే మెత్తని మేను కలిగిన పురుగు ఆరుద్ర పురుగు. ఇవి చూడ్డానికి చిటికెన వేలు గోరంతే ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో ‘కుంకుమ పురుగులు’ అని కూడా అంటారు. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయాన్ని ఆరుద్ర కార్తె అంటారు. ఆరుద్ర కార్తె మొదలవగానే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ కార్తెలో మొక్కలపైన, తడిసిన నేలపైన ఈ పురుగులు కనబడతాయి. అందుకే ఈ పురుగులకు ఆరుద్ర పురుగులు అనే పేరు వచ్చింది. కానీ ఇవి ప్రస్తుతం అంతరించే పరిస్థితి ఏర్పడింది. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వర్షాలు మొదలవుతున్న ఇలాంటి తరుణంలో తాజాగా హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఈ పురుగులు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలు వీటిని నేలపై నుంచి ఏరుకుంటూ అరచేతిలో ఉంచుకుని సంబరపడ్డారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు వాటిని చూస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ పురుగుల జీవితకాలం కూడా చాలా తక్కువే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

