పాపం.. ఈ దొంగ పరిస్థితి ఎవరికీ రాకూడదు !! రైలు కిటికీకి వేలాడుతూ

|

Sep 05, 2023 | 8:20 PM

రైలులో ఓ మహిళ పర్సు కొట్టేసిన దొంగ ప్రయాణికులకు దొరికిపోయి కొన్ని కిలోమీటర్ల పాటు కిటికీకి వేలాడాడు. చివరికి ఓ స్టేషన్‌లో అతడిని పోలీసులకు అప్పగించారు. బీహార్‌లోని బెగూసరాయ్ జిల్లాలో జరిగిందీ ఘటన. కటిహార్ నుంచి సమస్తిపూర్ వెళ్తున్న రైలులో మహిళ పర్సును కొట్టేసిన దొంగ పారిపోయే ప్రయత్నంలో ఇతర ప్రయాణికులకు చిక్కాడు. కిటికీలోంచి అతడిని పట్టుకున్నారు. ఇంతలో రైలు కదిలిపోవడంతో అతడు కిందపడకుండా గట్టిగా చేతులు పట్టుకున్నారు.

రైలులో ఓ మహిళ పర్సు కొట్టేసిన దొంగ ప్రయాణికులకు దొరికిపోయి కొన్ని కిలోమీటర్ల పాటు కిటికీకి వేలాడాడు. చివరికి ఓ స్టేషన్‌లో అతడిని పోలీసులకు అప్పగించారు. బీహార్‌లోని బెగూసరాయ్ జిల్లాలో జరిగిందీ ఘటన. కటిహార్ నుంచి సమస్తిపూర్ వెళ్తున్న రైలులో మహిళ పర్సును కొట్టేసిన దొంగ పారిపోయే ప్రయత్నంలో ఇతర ప్రయాణికులకు చిక్కాడు. కిటికీలోంచి అతడిని పట్టుకున్నారు. ఇంతలో రైలు కదిలిపోవడంతో అతడు కిందపడకుండా గట్టిగా చేతులు పట్టుకున్నారు. దొరికిపోయిన దొంగ ప్రాణభయంతో ఏడుపు లంకించుకున్నాడు. రైలు అలా కొన్ని కిలోమీటరు దూసుకెళ్లిన తర్వాత బచ్వారా జంక్షన్‌లో ఆగడంతో ఆర్పీఎఫ్ పోలీసులకు అతడిని అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆనందంగా జరుగుతున్న వేడుక.. అంతలోనే..

భారీగా ట్రాఫిక్ జామ్‌.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై దూసుకెళ్లిన ఆటో

ప్రపంచంలోనే అత్యంత పొడవైన జడ ఆమెసొంతం

ఇస్రోలో విషాదం.. సైంటిస్ట్‌ హఠాన్మరణం !! ఎలాగంటే ??

ఊరికి వెలుగునిచ్చేందుకు.. ప్రాణాలే ఫణంగా పెట్టిన లైన్‌మెన్

 

Follow us on