పూర్వం పెళ్లి సమయంలో వధూవరులను పల్లకిలో ఊరేగిస్తూ వధువు లేదా వరుడి ఇంటికి తీసుకెళ్లేవారు. నలుగురు బోయీలు ఒహోం ఒహోం అంటూ పల్లకిని మోసుకెళ్తుంటే అందరూ వీధుల్లోకి వచ్చి వరుడు ఎలా ఉన్నాడోనని చూసేవారు. మరోసారి అలాంటి పెళ్లిని గుర్తుచేశారు రాయుడివారి పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె. అంబేద్కర్ కోసీమజిల్లా, పి.గన్నవరం మండలం చాకలిపాలెంలో రాజుల కాలంనాటి పెళ్లిని తలపించింది మోహన్, సౌమ్యల వివాహం. నెమలిని పోలిన పల్లకిలో వధూవరులను కూర్చోబెట్టి, మేళతాళాలు, సన్నాయిమేళాలతో ఊరేగించారు. బుట్బొమ్మలు, వివిధ వేషధారణలతో చూపరులను ఆకట్టుకున్నాయి రాయుడివారి పెళ్లి ఏర్పాట్లు. డీజే సౌండ్లు, డాన్సులతో మోత మోగించకుండా సంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ.. ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. ఈ వివాహ వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కోనసీమవారి పెళ్లా.. మజాకా అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…