పోస్ట్ మాస్టర్ అదృశ్యం.. డబ్బును జమ చేసిన ఖాతాదారులకు షాక్

|

Feb 20, 2024 | 3:06 PM

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలోని గ్రామీణ పోస్టాఫీసులో ఇంటి దొంగే కన్నం వేశాడు. రూ.2 లక్షలు నగదుతో పోస్ట్ మాస్టర్ పరారైన షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. గరుడఖండిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‎గా విధులు నిర్వహిస్తున్నాడు ప్రశాంత్ కుమార్. గత నాలుగు రోజులుగా ఖాతాదారులు జమ చేసిన రూ. 2 లక్షలు నగదును తన జేబులో వేసుకుని చేతి వాటం ప్రదర్శించాడు. కాశీబుగ్గలోని డివిజనల్ ఇండియన్ పోస్టల్ శాఖకు ఖాతాదారుల జమ చేసిన సొమ్ము చెల్లించకుండా నగదుతో పరారయ్యాడు పోస్ట్ మాస్టర్.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలోని గ్రామీణ పోస్టాఫీసులో ఇంటి దొంగే కన్నం వేశాడు. రూ.2 లక్షలు నగదుతో పోస్ట్ మాస్టర్ పరారైన షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. గరుడఖండిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‎గా విధులు నిర్వహిస్తున్నాడు ప్రశాంత్ కుమార్. గత నాలుగు రోజులుగా ఖాతాదారులు జమ చేసిన రూ. 2 లక్షలు నగదును తన జేబులో వేసుకుని చేతి వాటం ప్రదర్శించాడు. కాశీబుగ్గలోని డివిజనల్ ఇండియన్ పోస్టల్ శాఖకు ఖాతాదారుల జమ చేసిన సొమ్ము చెల్లించకుండా నగదుతో పరారయ్యాడు పోస్ట్ మాస్టర్. గత నాలుగు రోజులుగా గరుడఖండి పోస్టాఫీసులోని ఆర్థిక లావాదేవీల వివరాలు అందించక పోవడంతో శ్రీకాకుళం జిల్లా ఇండియన్ పోస్టల్ శాఖ సూపరిండెంట్ శ్రావణ్ కుమార్ గరుడఖండి గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. బ్రాంచి పోస్టుమాస్టర్ ప్రశాంత్ పరారయ్యాడని నిర్థారించుకున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లాస్ రూమ్‌లో పిల్లల ఆటవిడుపు.. శంకరా అంటూ బుడ్డోళ్లు అదరగొట్టారుగా

బియ్యంనుంచే నేరుగా మాంసాహారం !! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ

Upasana Konidela: అత్తగారితో కలిసి ఉపాసన కొత్త బిజినెస్‌.. వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి

హాల్‌టికెట్‌పై ప్రముఖ హీరోయిన్‌ ఫోటో.. అవాక్కయిన స్టూడెంట్‌

Follow us on