Police Video: ఛీ ఛీ పోలీసువైయ్యుండి రోడ్డుసైడు పండ్ల షాపులో ఇదేం పని సామీ.. సీసీ కెమెరా లో రికార్డ్ వీడియో..
పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ తెచ్చే ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. ఇడుక్కి ఏఆర్ క్యాంప్లో పని చేసే పీవీ షిహాబ్.. కంజిరాపల్లిలోని ఓ రోడ్ సైడ్ దుకాణంలో మామిడి పండ్లను చోరీ చేశాడు.
పోలీసులంటే ప్రజలకు రక్షణగా నిలవాలి. కానీ వారే భక్షకులుగా మారితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. కంచే చేను మేసినట్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ దొంగ తనానికి పాల్పడ్డాడు. అది కూడా ఓ పండ్ల షాపులో. పోలీస్ డిపార్ట్మెంట్కే మచ్చ తెచ్చే ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటు చేసుకుంది. ఇడుక్కి ఏఆర్ క్యాంప్లో పని చేసే పీవీ షిహాబ్.. కంజిరాపల్లిలోని ఓ రోడ్ సైడ్ దుకాణంలో మామిడి పండ్లను చోరీ చేశాడు. ఆ దుకాణం దగ్గర కానీ, సమీపంలో కానీ ఎవరూ లేకపోవడంతో అందినకాడికి మామిడి పండ్లను బైక్ డిక్కీలో నింపేసుకున్నాడు. ఏమీ ఎరుగనట్టు చక్కగా వెళ్లిపోయాడు. కానీ ఇదంతా అక్కడే ఉన్న నిఘాకళ్లు పట్టేసాయి. సీన్ మొత్తం సీసీటీపీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. అయితే దొంగ హెల్మెట్, రెయిన్ కోట్ ధరించి ఉండడంతో మొదట అతనిని గుర్తించలేకపోయారు. కానీ బైక్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ మామిడి పండ్ల దొంగను హిహాబ్గా గుర్తించారు.కాగా తన కక్కుర్తి పనితో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసినందుకు అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం షిహాబ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు. కాగా డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలోనే షిహాబ్ ఈ పండ్ల చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

