Raghuveera Reddy: సామాన్యుడిలా రఘువీరారెడ్డి మనవరాలితో కలిసి జలవిహారం.. వీడియో వైరల్.
ఆయనదో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ఉమ్మడి ఆంధప్రదేశ్ కు మంత్రిగా పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. కాలక్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వ్యవసాయదారుడిగా హలం పట్టి.. సామాన్యుడిలా పొలం దున్నుతున్నారు.
ఆయనదో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, ఉమ్మడి ఆంధప్రదేశ్ కు మంత్రిగా పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. కాలక్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వ్యవసాయదారుడిగా హలం పట్టి.. సామాన్యుడిలా పొలం దున్నుతున్నారు. వయసు రీత్యా వచ్చే మార్పులను సామాన్యులే అంగీకరించక మేకప్ వేసుకుంటున్న రోజుల్లో సామాన్యుడిగా జీవిస్తున్న రాజకీయ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి తన మనవరాలితో కలిసి జలవిహారం చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైపోయింది. ఎక్కడా హస్తం పార్టీకి ప్రాతినిధ్యం అన్నదే లేకుండా పోయింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన రఘువీరారెడ్డి వంటి నేత కూడా దాదాపు అజ్ఞాతంలో గడిపేంతగా పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా కొన్నాళ్లు పనిచేసిన రఘువీరా ఆ తర్వాత పూర్తిగా స్వగ్రామం నీలకంఠాపురానికి పరిమితయ్యారు. ఈ క్రమంలో ఆయన వందల ఏళ్ల నాటి పురాతన ఆలయాల పునరుద్ధరణకు నడుంబిగించి అనుకున్నది పూర్తి చేశారు. అప్పుడప్పుడు రఘువీరా సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలు పంచుకుంటూ అభిమానులను పలకరిస్తుంటారు. తాజాగా, తన మనవరాలితో కలిసి ఓ ఫైబర్ డింగీలో జలవిహారం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. తమ స్వగ్రామం నీలకంఠాపురం వద్ద ఓ జలాశయంలో మనవరాలితో కలిసి సరదాగా గడిపినట్టు రఘువీరా ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

