గ్రామంలో వింత రూల్.. సైరన్ మోగిందంటే వాటిని పక్కన పడేయాల్సిందే !!

|

Oct 03, 2022 | 9:34 AM

అధునిక ప్రపంచం మొత్తం టెక్నాలజీ మయమైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఫోన్లకి, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వాటిపైనే ఉంటున్నారు.

అధునిక ప్రపంచం మొత్తం టెక్నాలజీ మయమైంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఫోన్లకి, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వాటిపైనే ఉంటున్నారు. బంధాలు అనుబంధాలు బలహీనమవుతున్నాయి. పిల్లల చదువులు, ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. అందుకే మహారాష్ట్రలో సాంగ్లి జిల్లాలోని మోహిత్యాంచే వడ్గావ్ గ్రామ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ మేనియా నుంచి అందరిని బయట పడేయడానికి వింత రూల్ పెట్టారు. ఆ గ్రామంలో ప్రతి రోజు రాత్రి ఏడు గంటలకు సైరన్ మోగుతుంది. అలా మోగిన వెంటనే అందరూ తమ చేతుల్లో ఉన్న ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, టీవీలు అన్ని బంద్ చేయాలి. పక్కనే పడేయాలి. పిల్లల్లో బద్ధకం పెరిగిందని, ఫోన్లలో ఎక్కువగా మునిగిపోతున్నారని గ్రామపెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా.. గంటన్నర పాటు.. వాటికి దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వినూత్న రూల్ ప్రకారం.. ప్రతి రోజు రాత్రి ఏడు గంటలకు గ్రామంలో హారన్ మోగుతుంది. అలా మోగిన వెంటనే పిల్లలు, పెద్దలు అందరూ ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలేయాలి. మళ్లీ గంటన్నరపాటు వాటి జోలికి వెళ్లకూడదు. గ్రామంలో ప్రతి ఒక్కరూ దీనిని పాటించాలి. అలా పాటిస్తున్నారో.. లేదో చెక్ చేయడానికి ఒక కమిటీని కూడా నియమించారు. ఇదిలావుంటే, ఈ గ్రామంలో మొదటి నుంచి సంప్రదాయాలను పాటిస్తున్నారు.. సామాజిక సామరస్యానికి పేరుగాంచిన గ్రామం. స్వతంత్ర సమర యోధులకు నిలయమైన ఈ గ్రామం పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తుంది. అందుకే ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఏదిఏమైనా గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ష్.. నేనూ ఇక్కడే పడుకుంటా.. డిస్టర్బ్ చెయ్యొద్దు..

ఓర్నీ.. నీ తెలివి తెల్లారిపోనూ.. సీటు కోసం అంత నాటకమా ??

ఇకపై వాట్సాప్‌ మెసేజ్‌ను ఎడిట్‌ చేసుకోవచ్చు.. ఎలా అంటే ??

ఫుడ్ కోసం పక్కా స్కెచ్.. నోటికందగానే సూపర్‌ ట్విస్ట్ ఇచ్చిన కుక్క..

క్లాస్‌ రూమ్‌లో బాలిక స్కూల్‌ డ్రెస్‌ విప్పించిన టీచర్.. పైగా ఫోటోలు షేర్

Follow us on