హవ్వ.. ఇదేం పని ?? దైవదర్శనానికి వెళ్లి దేవుడికే శఠగోపం పెట్టాడు !!

|

Aug 22, 2023 | 9:44 AM

ఎవరైనా భక్తితో గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకొని, హుండీలో తోచిన కానుక వేస్తారు. ఈ క్రమంలో పూజారి పూజ చేసి భక్తుల శిరస్సుపైన శఠగోపం ఉంచి ఆశీర్వదిస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి దైవదర్శనానికి వెళ్లి దేవుడికే శఠగోపం పెట్టేశాడు. అంటే పూజారి పెట్టినట్టుకాదు, గుడిలోని అమ్మవారి వెండివస్తువులు, శఠగోపం చక్కగా సంచిలో పెట్టుకొని ఉడాయించాడు. ఈ ఘటన విశాఖపట్నం పెందుర్తిలో చోటుచేసుకుంది. విశాఖ పెందుర్తి నూకాంబిక అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

ఎవరైనా భక్తితో గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకొని, హుండీలో తోచిన కానుక వేస్తారు. ఈ క్రమంలో పూజారి పూజ చేసి భక్తుల శిరస్సుపైన శఠగోపం ఉంచి ఆశీర్వదిస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి దైవదర్శనానికి వెళ్లి దేవుడికే శఠగోపం పెట్టేశాడు. అంటే పూజారి పెట్టినట్టుకాదు, గుడిలోని అమ్మవారి వెండివస్తువులు, శఠగోపం చక్కగా సంచిలో పెట్టుకొని ఉడాయించాడు. ఈ ఘటన విశాఖపట్నం పెందుర్తిలో చోటుచేసుకుంది. విశాఖ పెందుర్తి నూకాంబిక అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. రాష్ట్రం నలుమూలలనుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. అలాంటి అమ్మవారి ఆలయంలో పట్టపగలే చోరీ జరిగింది. సుమారు 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి భక్తుడిలా ఆలయంలోకి వచ్చి, అమ్మవారిని దర్శించుకున్నట్టే దర్శించుకుని పూజారి అటు వెళ్లగానే అమ్మవారి వెండివస్తువులు అపహరించుకుపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం

వామ్మో రాక్షసగూళ్లు.. వాటిలో ఏం దొరికాయో తెలుసా ??

శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..

మొసళ్ల మధ్యనుంచి దూసుకెళ్తోన్న బోటు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Saif Ali Khan: ఆదిపురుష్ రావణుడి ఆస్తులెంతో తెలుసా ??

 

Follow us on