గాయపడిన శునకం..అడ్డురాని పేదరికం.. పిల్లలు ఏం చేశారంటే?
గాయపడిన కుక్కను చూసి ఇద్దరు పిల్లలు చలించిపోయారు. అట్టపెట్టతో బండిని తయారుచేశారు. గాయంతో బాధపడుతున్న కుక్కను అందులో ఉంచి పశువైద్యశాలకు తీసుకువెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలో ఈ సంఘటన జరిగింది. మరో కుక్క కరవడంతో వీధి కుక్క గాయపడటాన్ని ఇద్దరు పిల్లలు చూశారు. అట్టపెట్టుతో చక్రాల బండిని తయారుచేశారు. కుక్కను అందులో ఉంచి పశువైద్యశాలకు తరలించారు. ఆ పిల్లల దగ్గర డబ్బులు లేవు. అయినా సరే కుక్కను బాధ నుంచి తప్పించాలి, నయం చేయాలన్న ఆలోచనతో హాస్పిటల్ కు వెళ్లారు. పెద్దలు వీరిలా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది అంటూ వీడియోకు క్యాప్షన్ జోడించారు.
చికిత్స తర్వాత అట్టపెట్ట బండీలో దాన్ని ఉంచి ఇంటికి తిరిగి వెళుతుండగా దారిలో ఓ వ్యక్తి వారిని ఆపి వివరాలు అడిగాడు. కుక్కను డాక్టర్ కు చూపించి చికిత్స చేయించామని ఓ బాలుడు అన్నాడు. మళ్లీ తీసుకురావాలని డాక్టర్లు సూచించారని తెలిపాడు. పెద్ద పిల్లవాడు తాడుతో ఆ బండిని లాగగా చిన్న పిల్లవాడు వెనుక నుంచి దాన్ని తోశాడు. కాగా గాయపడిన కుక్కకు చికిత్స కోసం అట్టపెట్ట బండిలో ఉంచి మండుటెండలో వెటర్నరీ హాస్పిటల్ కు పిల్లలు తీసుకెళ్ళిన ఈ సంఘటనను ఆ వ్యక్తి రికార్డు చేశాడు. మే 14న స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో క్లిప్ ను పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. 2,30,000 వ్యూస్ 25,000 లైక్స్ వచ్చాయి. పేదరికంలో ఉన్న ఆ ఇద్దరు పిల్లలు జంతువుల పట్ల ఆ పిల్లలు చూపిన ప్రేమ దయకు నెటిజన్లు ముగ్ధులయ్యారు.
మరిన్ని వీడియోల కోసం :
ఓల్డ్సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో
మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా?వీడియో
51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు వీడియో
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
