ఓల్డ్సిటీ అగ్నిప్రమాదంలో గుండెలు బద్దలయ్యే వివరాలు వీడియో
అప్పటిదాకా ఏసీలో చల్లగా కునుకు తీస్తున్న శరీరాలకు ఒక్కసారిగా వేడి తగిలింది. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ ఎవరూ కనిపించనంత దట్టమైన పొగ. ప్రమాదం జరిగిందని అర్థమైంది. కానీ బయటపడే దారి లేదు. అంతటి భయాణక పరిస్థితుల్లోనూ పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి చివరి క్షణం దాకా ప్రయత్నించింది. విధి ఆడిన వింత నాటకంలో చివరికి నిస్సహాయంగా ప్రాణాలు విడిచింది. 17 మంది మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులే. పెద్దలే బయటపడలేకపోయిన ప్రమాదంలో నిస్సహాయంగా మంటల్లో కాలిపోయారు పిల్లలు.
ఈ ప్రమాదంలో ఓ దృశ్యం అందరి గుండెల్ని పిండేసింది. నలుగురు పిల్లలను చేతుల్లో పట్టుకుని ఓ మహిళ అలాగే మంటల్లో కాలిపోయింది. కనీసం పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో. గోడ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన స్థానిక యువకుల కంటిపడింది విషాద దృశ్యం. పొగ మంటలతో నిండిన ఆ ఇంటి మొదటి అంతస్తులో కనిపించింది మహిళా మృతదేహం. కానీ తను ఒంటరిగా లేదు. ఆమె చేతుల్లో నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, ఓ పసికందు. మొబైల్ టార్చ్ వెలుగులో బయటపడేందుకు మార్గం ఏదైనా దొరుకుతుందని ఆ మహిళ చివరి దాకా ప్రయత్నించింది. ఓవైపు మంటలు మరోవైపు పొగతో ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి.
Follow Us
వైరల్ వీడియోలు
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్
సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరి చరిత్ర సృష్టించిన టీచర్
అర్చకుల విదేశీయానం ధర్మ విరుద్ధమా ??
ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??
బురఖాలో వచ్చింది.. గన్ బయటకు తీసింది.. ఆ తర్వాత..

