చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. సంచులతో ఎగబడిన జనం

|

Jun 12, 2024 | 11:57 AM

సాధారణంగా కొన్నదానికంటే కొట్టుకొచ్చింది రుచి ఎక్కువ అని నానుడి. కొనుక్కుని తిన్న దానికంటే ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మనవాళ్లు ముందుంటారని చెప్పాలి. దీనికి సరిగ్గా సరిపోతుంది ఈ సీన్‌. చేపల లోడ్‎తో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. అయ్యో అనాల్సింది పోయి..అసలు పట్టించుకోలేదు అక్కడి జనాలు. అసలు లారీలో ఉన్న మనుషులకు ఏమైనా అయ్యిందా అని కూడా కనికరం చూపించలేదు. సంచులు పట్టుకొని చేపల కోసం మాత్రం ఎగబడ్డారు.

సాధారణంగా కొన్నదానికంటే కొట్టుకొచ్చింది రుచి ఎక్కువ అని నానుడి. కొనుక్కుని తిన్న దానికంటే ఫ్రీగా వచ్చిన దాన్ని తినడంలో మనవాళ్లు ముందుంటారని చెప్పాలి. దీనికి సరిగ్గా సరిపోతుంది ఈ సీన్‌. చేపల లోడ్‎తో వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. అయ్యో అనాల్సింది పోయి..అసలు పట్టించుకోలేదు అక్కడి జనాలు. అసలు లారీలో ఉన్న మనుషులకు ఏమైనా అయ్యిందా అని కూడా కనికరం చూపించలేదు. సంచులు పట్టుకొని చేపల కోసం మాత్రం ఎగబడ్డారు. విజయవాడ-హైదరాబాద్‌ రహదారిపై క్యాట్‌ ఫిష్‌ చేపల లోడ్‎తో వెళ్తున్న లారీఅదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‎కు గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. లారీ బోల్తాపడ్డంతో చేపలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. చేపల లోడుతో వెళ్తున్న లారీ ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారుకు పెట్రోలు కొట్టిద్దామనుకున్న ఓనర్‌.. బ్యానెట్ లోపల అదిరిపోయే సీన్‌..!

సౌర తుపానుల‌ను చిత్రీక‌రించిన ఆదిత్య L1.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

అకస్మాత్తుగా లేచి కూర్చున్న శవం.. అవాక్కైన స్థానికులు, పోలీసులు

బిగ్ బాస్‌8లోకి బ్యూటిఫుల్ పాపలు.. ఈ సారి ఇక రచ్చో రచ్చ

ఆ సర్జరీ చేయించుకోమని.. నన్ను మానసికంగా వేధించేవారు

Follow us on