బ్రతకదు అనుకున్న భార్యకు ప్రాణం పోసిన భర్త

|

Aug 17, 2023 | 10:13 PM

వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకదన్న ఓ మహిళకు.. కట్టుకున్న భర్తే పునర్జన్మ ప్రసాదించాడు. పొత్తి కడుపు నొప్పితో ఐదేళ్లుగా బాధపడుతున్న 39 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో.. భర్త లివర్‌తో ప్రాణం పోశారు వైద్యులు. హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్ సుల్తానా పొత్తికడుపు నొప్పితో పాటు.. కామెర్లతో నెల కిందట ఫిట్స్‌ రావడంతో బెడ్‌కే పరిమితమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కోమాలోకి వెళ్లింది.

వారం రోజుల కంటే ఎక్కువ బ్రతకదన్న ఓ మహిళకు.. కట్టుకున్న భర్తే పునర్జన్మ ప్రసాదించాడు. పొత్తి కడుపు నొప్పితో ఐదేళ్లుగా బాధపడుతున్న 39 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో.. భర్త లివర్‌తో ప్రాణం పోశారు వైద్యులు. హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్ సుల్తానా పొత్తికడుపు నొప్పితో పాటు.. కామెర్లతో నెల కిందట ఫిట్స్‌ రావడంతో బెడ్‌కే పరిమితమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కోమాలోకి వెళ్లింది. ఆమెను పరీక్షించిన స్థానిక ఆసుపత్రి వైద్యులు.. వారం రోజులకు మించి బతకదని తేల్చి చెప్పారు. దాంతో లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకోచ్చారు కుటుంబసభ్యులు. మహిళకు శ్రానిక్‌ లివర్‌ ఫెయిల్యూర్‌గా గుర్తించిన వైద్యులు.. కాలేయం మార్చాలని సూచించారు. దీంతో భర్త మహమ్మద్ లియాఖత్ లివర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అనంతరం కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. పడకకు పరిమితమైన ఆమె పది రోజుల్లో కోలుకుని నడవడం ప్రారంభించారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో పాటు తన పనులు తాను చేసుకునే స్థితికి చేరిందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుష్పాను మరిపించే రియల్ సీన్.. ఆ ఒక్కటి తప్పా.. అంతా సేమ్ టూ సేమ్

స్కూల్ కింద 2వేల బాంబులు.. జస్ట్‌ మిస్.. లేదంటే ??

జిమ్‌లో విరాట్‌ కోహ్లీ వర్కవుట్స్‌ చూస్తే అదిరిపడతారు

పేలిన పార్క్ చేసిన స్కూటర్.. అర్థరాత్రి పరుగో పరుగు!

ప్రియురాలిని బైక్‌పైనుంచి తోసేసి యువకుడు పరార్‌..ఏం జరిగిందంటే ??

 

Follow us on