పేలిన పార్క్ చేసిన స్కూటర్.. అర్థరాత్రి పరుగో పరుగు!
చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లు పేలిపోవడం చూశాం.. చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ బైకులు పేలిన సందర్భాలు చూశాం.. కానీ చార్జింగ్ పెట్టకుండానే ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ పేలి కాలి బూడిదైంది. ఈ సంఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం మండలం సడ్లపల్లిలో నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆరు నెలల క్రితం కైనెటిక్ ఎలక్ట్రికల్ స్కూటర్ను కొనుగోలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఇంట్లో పార్క్ చేసిన స్కూటర్ ఛార్జింగ్ పెట్టకుండానే అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది.
చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లు పేలిపోవడం చూశాం.. చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ బైకులు పేలిన సందర్భాలు చూశాం.. కానీ చార్జింగ్ పెట్టకుండానే ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ పేలి కాలి బూడిదైంది. ఈ సంఘటన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం మండలం సడ్లపల్లిలో నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆరు నెలల క్రితం కైనెటిక్ ఎలక్ట్రికల్ స్కూటర్ను కొనుగోలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఇంట్లో పార్క్ చేసిన స్కూటర్ ఛార్జింగ్ పెట్టకుండానే అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. మంటల ధాటికి ఇంట్లోని టీవీ, ఫర్నిచర్ కాలిపోయాయి. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా స్కూటర్లో మంటలు చెలరేగడంతో నిద్రలో ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. కాలుతున్న స్కూటర్ను అతి కష్టం మీద బయటకు తీశారు. అయితే అప్పటికే ఇంట్లోని ఫర్నిచర్కు మంటలు అంటుకున్నాయి. ఆరు నెలల క్రితం కొనుగోలు చేసిన స్కూటర్కు ఇంకా వారంటీ కూడా తీరలేదు. డ్రైవింగ్ చేసే సమయంలో పేలి ఉంటే తమ పరిస్థితేంటని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలిని బైక్పైనుంచి తోసేసి యువకుడు పరార్..ఏం జరిగిందంటే ??
కరెంట్ స్విచ్బోర్డ్లో దొరికిన 15 కోట్ల విలువైన వజ్రం
క్రికెట్లో మెరుపులు కురిపిస్తున్న పోలీస్ !! బౌలింగ్తో బ్యాటర్ను క్లీన్ బౌల్డ్ చేసిన పోలీసు
పట్టాలపై పిల్లాడు.. స్పీడుగా వస్తున్న రైలు.. తర్వాత ఏం జరిగిందంటే ??
కళ్లెదుటే ఎలుగుబంటి.. తెలివిగా తప్పించుకున్నారిలా !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

