రిటైర్ అవుతున్న యజమాని.. వీడ్కోలు పలికిన శునకం..
కుక్కలు మనుషులతో ఎంత అద్భుతంగా బంధాన్ని ఏర్పరుచుకుంటాయో తెలిసిందే. తమ యజామాని పట్ల ఎంత విధేయత చూపుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వాటికి మన మాటలు అర్థం కాకపోయినా..మనకేం జరుగుతుంది, ఏం చేస్తున్నాం అన్నది ఇట్టే పసిగట్టేస్తాయి. మూగజీవే అయినా..ఎంత అందంగా భావోద్వేగాలను అర్థం చేసుకుంటాయో అనేందుకు ఉదాహరణే ఈ అగ్నిమాపక స్టేషన్లో జరిగిన ఘటనే.
కేరళలో అగ్నిమాపక సిబ్బందికి చెందిన ఒక అధికారి రిటైర్ అవుతుంటే..శునకం ఎంత అద్భుతంగా వీడ్కోలు చెప్పిందో చూస్తే..ఆశ్యర్యంగా అనిపిస్తుంది. స్టేషన్లో ఇటీవల అగ్నిమాపక అధికారి షాజు పదవీవిరమణ చేసారు. ఆ రోజు తోటి సహచర సిబ్బంది అంతా ఆయనకు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత అదే స్టేషన్లో ఉండే రాజు అనే కుక్క కూడా ఆయన పక్కకు వచ్చి నిలబడి మూగగా వీడ్కోలు చెప్పింది. నోటితో భావాన్ని వ్యక్తం చేయలేకపోయినా..అది నిశబ్దంగా వీడ్కోలు చెప్పిన తీరు అమోఘం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘టాకింగ్ ట్రీ’.. కబుర్లు చెబుదామా! AIతో వండర్ చేసిన ట్రినిటి పరిశోధకులు
గల్ఫ్ దేశాలకు క్యూ కడుతున్న కోటీశ్వరులు! కారణమేంటంటే..
TOP 9 ET News: ప్రభాస్ ఉన్న ఆ 30 నిమిషాలు థియేటర్లో రచ్చ రచ్చే..
శ్రీలీల,రష్మిక ఉందిగా.. మళ్లీ తమన్నాను ఎందుకు? ఇచ్చిపడేసిన హీరోయిన్
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్
సైకిల్పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరి చరిత్ర సృష్టించిన టీచర్
అర్చకుల విదేశీయానం ధర్మ విరుద్ధమా ??
ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??
బురఖాలో వచ్చింది.. గన్ బయటకు తీసింది.. ఆ తర్వాత..

