జీపీఎస్‌ని గుడ్డిగా నమ్మాడు.. అదే ప్రాణాలు తీసింది !!

|

Oct 13, 2022 | 9:18 AM

కుమార్తె బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి ఇంటికి తిరిగి వెళ్తున్నాడతను. అసలే రాత్రి, దానికి తోడు భారీగా వర్షం పడుతోంది. అందుకని జీపీఎస్ ఆన్ చేసి దానిలో దారి చూసుకుంటూ వెళ్తున్నాడు.

కుమార్తె బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి ఇంటికి తిరిగి వెళ్తున్నాడతను. అసలే రాత్రి, దానికి తోడు భారీగా వర్షం పడుతోంది. అందుకని జీపీఎస్ ఆన్ చేసి దానిలో దారి చూసుకుంటూ వెళ్తున్నాడు. అలా గుడ్డిగా టెక్నాలజీని నమ్మడమే అతని ప్రాణాలు తీసింది. జీపీఎస్‌లో అక్కడ లేని బ్రిడ్జి ఉందని నమ్మిన అతను.. జీపుతో సహా నదిలో పడి మరణించాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో వెలుగు చూసింది. హికరీలో నివసించే ఫిల్ పాక్సన్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం రాత్రి పూట ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆ కుటుంబం.. కనీసం ఒక్క సైన్ బోర్డు ఉన్నా కూడా ఫిల్ ప్రాణాలతో ఉండేవాడని అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జొమాటో బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతిచ్చి స్వాగతం..

నా కారుకు పేరు పెట్టండి.. నెటిజన్లకు టెక్‌ దిగ్గజం బంపరాఫర్

కస్టమర్‌కు ‘ఉబర్‌’ షాక్‌.. 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షల ఛార్జ్ !!

181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. అతడెవరో తెలుసా ??

Follow us on