కొత్త టెక్నిక్తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్
చేపలు పట్టడంలో కొత్త టెక్నాలజీ వాడుతున్నారు గోదారోళ్ళు. పెద్ద పెద్ద వలలు, గేలాలు పక్కన పారేసి, చేత్తో ప్లాస్టిక్ డబ్బా తీసుకుపోయి, బోలెడన్ని చేపలు పట్టుకుని ఎంచక్కా వచ్చేస్తున్నారు. తమదైన పద్ధతిలో గోదావరిలో పెద్ద పెద్ద చేపలు పడుతూ గోదావరి ప్రాంత వాసులను ఆశ్చర్య పరుస్తున్నారు. ఏదైనా పాత్రలో దూరిన తర్వాత చేపలు ఇక వెనక్కి రావనే పాయింట్ను పట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంత వాసులు.. ఈ కొత్త పద్ధతిలో చేపలు పడుతూ.. రెండు చేతులా డబ్బు సంపాదిస్తున్నారు.
ఈ బాటిల్ ట్రాప్ తో రెండు కిలోల చేపలు కూడా దొరుతున్నాయంటున్నారు ఈ ప్రాంత యువకులు. ఇందుకోసం వీరు ప్లాస్టిక్ బాటిల్, వరిపిండి లేదా మైదా పిండిని వాడుతున్నారు. ముందుగా ఓ ప్లాస్టిక్ సీసాను పైభాగం తొలగించి మిగిలిన దాంట్లో పిండి ముద్దను పెట్టి, ఆ బాటిల్ను నదిలోకి జారవిడుస్తున్నారు. సీసాలోని పిండిని తినేందుకు చేపలు అందులోకి వచ్చి అక్కడే చిక్కుకుంటూ వెనక్కి వెళ్లలేక ఇరుక్కుని, అటూ ఇటూ కొట్టుకుంటోంది. దీంతో వీరు వదిలిన తాడు కదులుతుంది. దీనిని గమనించగానే, టక్కున లాగేసి, ఆ చేపను పట్టుకుంటున్నారు. ఈ కొత్త టెక్నాలజీలో చేపలు బాగా పడుతుండటంతో నరసాపురం గోదావరి తీరంలో.. వందలాది మంది యువత ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకుని, చేపలు పట్టేందుకు వస్తున్నారు. వర్షాకాలం సీజన్ కూడా కావటంతో, గోదావరిలో చేపలు విరివిగా దొరుకుతుండటంతో వాటిని పట్టి మంచి ధరకు అమ్ముకుంటున్నారు. ఈ సీజన్లో దీనివల్ల తమకు కొంతైనా ఆదాయం వస్తున్నందుకు ఇక్కడి యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..
దీపికకు అరుదైన ఘనత.. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ ఈమే
ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా !! థియేటర్స్ ఊగిపోయేలా.. మాస్ మసాలా నూరుతున్న తమన్
కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి
50 ఏళ్లుగా గ్యాస్ వాడకుండానే..నడుస్తున్న హోటల్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్

