Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతడినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తె.. పరువు పోతుందని కన్నతండ్రి ఏం చేశాడంటే..

అతడినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తె.. పరువు పోతుందని కన్నతండ్రి ఏం చేశాడంటే..

Phani CH

|

Updated on: Mar 10, 2025 | 9:01 PM

అనంతపురం జిల్లా గుంతకల్లులో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానన్న కూతురిని తండ్రి కడతేర్చాడు.. వేరే సామాజికవర్గం యువకుడిని పెళ్లి చేసుకుంటాననడంతో కన్నతండ్రి హత్య చేసి.. పెట్రోల్ పోసి తగులబెట్టాడు. గుంతకల్ లోని తిలక్ నగర్ లో నివాసముంటున్న తుపాకుల రామాంజనేయులుకు నలుగురు కుమార్తెలు.

చిన్న కుమార్తె అయిన భారతి అదే గుంతకల్ కు చెందిన మరో యువకుడితో ప్రేమలో పడింది. కాకపోతే ఇద్దరి కులాలు వేరు. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టడంతో… కొద్ది రోజులుగా కూతురు భారతి తండ్రి రామాంజనేయులు మధ్య గొడవ పెరిగింది. సంక్రాంతికి వచ్చిన కుమార్తెను కాలేజీకి పంపించకుండా ఇంట్లోనే ఉంచాడు రామాంజనేయులు. చిన్న కూతురు భారతి కంటే పెద్ద కూతుళ్లు ముగ్గురికి ఇంకా పెళ్లి కాకపోవడంతో… కులాంతర వివాహానికి ఒప్పుకుంటే మిగిలిన కుమార్తెలకు ఇబ్బంది కలుగుతుందని భావించాడు. గత కొద్ది రోజులుగా తండ్రి కూతుళ్ళ మధ్య వాగ్వాదం నడుస్తోంది. అయినా ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చిన్న కుమార్తె భారతి స్పష్టం చేసింది. దీంతో మార్చి ఒకటిన గుంతకల్ పట్టణానికి దూరంగా తిక్క స్వామి దర్గా దగ్గరలోని కొండగుట్టలోకి కుమార్తె భారతిని రామాంజనేయులు తీసుకెళ్లాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చంద్రుడి మీద సూర్యోదయం ఎలా ఉంటుందో చూశారా

మనవరాలు చేసిన పనికి.. అమ్మమ్మ ఖాతా నుంచి రూ.80 లక్షలు ఖాళీ

నెమ్మదిస్తోన్న ఆ సముద్ర ప్రవాహంతో భారీ ముప్పు

ఉల్లి, వెల్లుల్లిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

‘హీరోలను పొగడడానికే హీరోయిన్లు’ సౌత్ సినిమాలపై జ్యోతిక సంచలన కామెంట్స్