Pit Bull: పిట్‌ బుల్స్‌ దాడిలో యువతి మృతి

Updated on: Nov 29, 2025 | 12:20 PM

టెక్సాస్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మూడు పిట్ బుల్స్ దాడిలో 23 ఏళ్ల కాలేజీ విద్యార్థిని, కుక్కల కేర్‌టేకర్ మాడిసన్ రిలే హల్ మరణించింది. యజమానులు ఊర్లో లేనప్పుడు ఈ విషాదం జరిగింది. గతంలో ప్రేమగా ఉన్న కుక్కల ప్రవర్తనలో మార్పు వచ్చిందని తల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెంపుడు జంతువుల భద్రతపై ఆందోళనలు రేకెత్తించిన ఘటన ఇది.

పెంపుడు కుక్కలు యజమాని మీద ఆగ్రహం చూపించడం, ఒక్కోసారి ప్రాణాలను తీయడం చాలా అరుదుగా జరిగే విషాదం. అమెరికాలో కుక్కల కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్న 23 ఏళ్ల కాలేజీ విద్యార్థిని, కుక్కల చేతిలో దారుణంగా చనిపోయింది. మూడు పిట్ బుల్స్ ఒకేసారి దాడి చేయడంతో ఆమె ప్రాణాలు విడిచింది. టెక్సాస్‌లోని టైలర్‌లోని ఉండే కుటుంబం మూడు పిట్ బుల్స్‌ ను పెంచుకుంటోంది. టెక్సాస్ విశ్వవిద్యాలయ విద్యార్థిని మాడిసన్ రిలే హల్‌కు కూడా ఇవంటే చాలా ప్రేమ. అవి కూడా ప్రేమగానే ఉండేవి. నవంబర్ 21న సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో హల్ ఇంటి వెనుక దాడిచేయడంతో విగతజీవిగా కనిపించింది. హల్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఇటీవల కుక్కల యజమాని ఇంట్లో కుటుంబ పిల్లలను చూసుకునేంది. అలాగే కుక్కలను కూడా చూసుకునేందుకు అంగీకరించింది. ఏమైందో తెలియదు కానీ ఇంటి యజమానులు ఊర్లో లేనప్పుడు ఆమెపై దాడి చేశాయి. ఆ శబ్దం విన్న పొరుగువారు, అత్యవసర సేవలకు ఫోన్ చేశారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన అధికారిపైనా దాడికి యత్నించడంతో పిట్ బుల్స్‌లో ఒకదానిని కాల్చి చంపారు. మిగిలిన రెండు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె గాయాలతో కొద్దిసేపటికే మరణించింది. హల్‌ తల్లి జెన్నిఫర్ హబ్బెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆమె తల్లి జెన్నిఫర్ హబ్బెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఆమె పట్ల ప్రేమగా ఉన్న కుక్కలలో ఇటీవల వచ్చిన మార్పు గురించి తన కూతురు ప్రస్తావించిందని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhoni: కోహ్లీ కోసం డ్రైవర్‌గా మారిన ధోనీ..ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్- వైజాగ్ బస్ టికెట్.. రూ. 7000

Sonali Bendre: నా క్యాన్సర్ తగ్గుదలకు ప్రకృతి వైద్యమూ సాయపడింది

ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

మరో మూడురోజుల కస్టడీ.. ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా ?? విలనా ??