Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు

Waterfalls: కరువు సీమలో జలకళ.. కనువిందు చేస్తున్న ఎత్తిపోతలు

Phani CH

|

Updated on: Sep 06, 2023 | 9:51 AM

గత నాలుగేళ్లలో ఎప్పుడు లేనంత వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు సైతం నీరు కరువైంది. పంట పొలాలకు సాగునీరు సైతం అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో జోరు వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలోని ఎత్తిపోతల జలకళ సంతరించుకుంది. దీంతో ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఎత్తిపోతలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

గత నాలుగేళ్లలో ఎప్పుడు లేనంత వర్షాభావ పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు సైతం నీరు కరువైంది. పంట పొలాలకు సాగునీరు సైతం అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో జోరు వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలోని ఎత్తిపోతల జలకళ సంతరించుకుంది. దీంతో ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఎత్తిపోతలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సుధీర్ఘంగా పొడవు, ఎత్తైన కొండల నుండి జాలువారుతున్న నీటి ప్రవాహం, చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎత్తిపోతలకు నీటి ప్రవాహాం మొదలైంది. మట్టితో కూడిన ఎర్ర నీరు అంత ఎత్తైన కొండల నుండి కిందకు పడుతుండటంతో పర్యాటకులు ఎత్తిపోతలను చూసి సంబరపడిపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Global Warming: భవిష్యత్‌ తరాలకు అత్యంత కష్టకాలంగా మారనుందా ??

Anantapur: భార్య, ప్రియుడికి అరగుండు కొట్టించిన భర్త