జాతి వైరాన్ని మరిచి.. మాతృత్వాన్ని పంచిన శునకం

|

Jan 09, 2024 | 9:39 PM

అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపు‌నిండా అన్నం పెట్టగలిగేది అమ్మే. ఇది మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ జరుగుతుంది. తాజాగా ఓ శునకం జాతి వైరాన్ని మరచి మేక పిల్లను హక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం భగవాన్ పూర్ లో చోటు చేసుకుంది. అసలే ఈ మధ్య ఎక్కడ చూసినా మేకల మందలపై కుక్కల దాడి.. చిన్నారుల పై వీది కుక్కల దాడి..

అమ్మంటే అమ్మే.. శత్రువుకైనా కడుపు‌నిండా అన్నం పెట్టగలిగేది అమ్మే. ఇది మనుషుల్లోనే కాదు, పశుపక్ష్యాదుల్లోనూ జరుగుతుంది. తాజాగా ఓ శునకం జాతి వైరాన్ని మరచి మేక పిల్లను హక్కున చేర్చుకుని తన పిల్లలతో పాటు పాలిచ్చి కడుపు నింపింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం భగవాన్ పూర్ లో చోటు చేసుకుంది. అసలే ఈ మధ్య ఎక్కడ చూసినా మేకల మందలపై కుక్కల దాడి.. చిన్నారుల పై వీది కుక్కల దాడి.. వార్తలే వినిపిస్తున్న ఈ సమయంలో మాతృత్వాన్ని చాటిన ఈ శునకం వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. జాతి వైరం మరిచి మాతృత్వపు మాధుర్యం పంచిన ఈ శునకం తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. భగవాన్ పూర్ గ్రామంలో యువరాజ్​ అనే యువకుడికి చెందిన పెంపుడు శునకం మూడు పిల్లలకు జన్మ నిచ్చింది. తన పిల్లలకు ఆ శునకం పాలు ఇవ్వగా చూసిన మేక పిల్ల దగ్గరకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. ఆ శునకం కూడా ఏమీ అనకుండా తన పిల్లలతో పాటు ఆ మేక పిల్లకు సైతం చనుబాలు ఇచ్చి ఆకలి తీర్చింది. ప్రస్తుతం ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్కటైన కోనసీమ కుర్రది.. స్పెయిన్‌ కుర్రాడు..

భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ

నిజామాబాద్‌లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం

KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా

Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్

Follow us on