కాలువలో ఈత కొడుతున్న గేదెలు.. అంతలో ఊహించని షాక్‌

|

Aug 01, 2023 | 9:18 PM

ఇటీవల భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో వరద నీటిలో జలచరాలు కొట్టుకొస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చేపలు వరదనీటిలో కొట్టుకు రాగా జనాలు పండగ చేసుకున్నారు. అయితే బాపట్ల జిల్లాలో మాత్రం వరద నీటికి మొసలి కొట్టుకొచ్చింది. కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని కొమ్మమూరు కాలువలో మొసలి కలకలం సృష్టించింది .

ఇటీవల భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో వరద నీటిలో జలచరాలు కొట్టుకొస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చేపలు వరదనీటిలో కొట్టుకు రాగా జనాలు పండగ చేసుకున్నారు. అయితే బాపట్ల జిల్లాలో మాత్రం వరద నీటికి మొసలి కొట్టుకొచ్చింది. కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని కొమ్మమూరు కాలువలో మొసలి కలకలం సృష్టించింది . నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన ఒక మొసలి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. గ్రామానికి చెందిన అల్లాడి దేవమణి అనే మహిళకు చెందిన గేదెలు కాలువలో దిగి ఈతకొడుతున్నాయి. ఇంతలో ఓ పెద్ద మొసలి వచ్చి గేదె కాలుని పట్టుకుంది. అలర్టయిన గేదె మొసలి బారినుంచి తప్పించుకొని గట్టుపైకి వస్తుండగా మరో కాలు పట్టుకుని దాడి చేసింది. అయినా ఏమాత్రం భయపడకుండా గేదె మొసలిని ప్రతిఘటించి పైకి చేరుకుంది. మొసలి దాడిలో గేదె కాలుకి గాయమైంది. కాల్వలో మొసలి కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hampi: ఏఐ ఫొటోలలో అద్భుతంగా అలనాటి హంపి !!

ఏడుపు మారథాన్‌.. అంతకంటె ఏడవలేకపోయాడు

రెండేళ్ల క్రితం చనిపోయిన మహిళ.. సోషల్‌మీడియాలో ప్రత్యక్షం !!

యుద్ధానికి సిద్దమవుతున్న OG.. ఈ సారి పవన్ స్టంట్స్‌కు టాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే

Bro Collections: ఎవరెన్ని వాగినా.. ఆగని బ్రో కలెక్షన్లు.. పవన్ కెరీర్లో రికార్డ్

 

Follow us on