సాయంత్రంవేళ వీధిలో చేరి చర్చించుకుంటున్న వ్యక్తులు.. క్షణాల్లో సజీవ సమాధి

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఎండతీవ్రత తగ్గడంతో అంతా వీధిలో చేరి ముచ్చటించుకుంటున్నారు. అంతలోనే అక్కడ ఊహించని ఘటన చోటుచేసుకుంది. క్షణాల్లో నలుగురు వ్యక్తులు సజీవసమాధి అయిపోయారు. హర్యానా గురుగ్రామ్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డయింది. CCTV ఫుటేజీ బఆధారంగా .. హర్యానా గురుగ్రామ్‌లోని మదనపురిగ్రామంలో శ్మశాన వాటికను ఆనుకొని ఓ వీధి ఉంది.

సాయంత్రంవేళ వీధిలో చేరి చర్చించుకుంటున్న వ్యక్తులు.. క్షణాల్లో సజీవ సమాధి

|

Updated on: Apr 22, 2024 | 12:47 PM

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఎండతీవ్రత తగ్గడంతో అంతా వీధిలో చేరి ముచ్చటించుకుంటున్నారు. అంతలోనే అక్కడ ఊహించని ఘటన చోటుచేసుకుంది. క్షణాల్లో నలుగురు వ్యక్తులు సజీవసమాధి అయిపోయారు. హర్యానా గురుగ్రామ్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అక్కడి సీసీ టీవీలో రికార్డయింది. CCTV ఫుటేజీ బఆధారంగా .. హర్యానా గురుగ్రామ్‌లోని మదనపురిగ్రామంలో శ్మశాన వాటికను ఆనుకొని ఓ వీధి ఉంది. శ్మశానవాటిక చట్టూ ప్రహారీ గోడ ఉంది. పక్కవీధిలోని వ్యక్తులు సాయంత్రం వేళ ఆ గోడను ఆనుకొని కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. రోజూలాగే శనివారం కూడా అందరూ సాయంత్రం వేళ గోడవద్దకు చేరారు. అంతాచేరి ఏవో చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో వారు ఊహించని విధంగా శ్మశానవాటిక గోడ ఒక్కసారిగా కూలివారిపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు సజీవ సమాధి అయ్యారు. గోడ కూలిన సమయంలో వారంతా తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ..ఫలితం లేకపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిండు గర్భిణీకి నిప్పు అంటించిన భర్త.. ఏం జరిగిందంటే ??

Tiffin Bomb: తమిళనాడు లో పేలిన టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌

ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్

పెద్దలను ఒప్పించి ఘనంగా.. శ్రీకృష్ణుడి విగ్రహంతో పెళ్లి

Health Insurance: ఇక ఏ వయసు వారైనా ఆరోగ్య బీమా తీసుకోవచ్చు

Follow us