చిత్తూరు జిల్లాలో తుపాకులతో బెదిరించి ఆవుల దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో :Cows Robbery video.

|

Jun 26, 2021 | 1:35 PM

Cows Robbery: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎదులను దొంగిలించారు కొందరు దుండగులు.


ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఆవులు, ఎద్దులను దొంగిలిస్తున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జిల్లాలోని గంగవరంలో ఆవులు, ఎదులను దొంగిలించారు కొందరు దుండగులు. గాంధీనగర్‌లో 5 ఆవులు, 2 ఎద్దులను దొంగల ముఠా అపహరించుకెళ్లింది. అయితే, ఘటన జరిగిన పశువుల కొట్టంలో కంట్రీ మేడ్ రివాల్వర్ లభ్యమవడంతో గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు. దుండగులు ఒకవేళ తాము దొరికితే కంట్రీమేడ్ రివాల్వర్‌తో జనాలను భయపెట్టి తప్పించుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రివాల్వర్‌ను గమనించిన పోలీసులు.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠా ఈ దోపిడీలకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.కాగా, ఈ ముఠా గతంలోనూ తమిళనాడులోని వేలూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బిల్లు మూడు వేలు..టిప్పు 12 లక్షలు..!షాక్ అయినా వెయిటర్..షాక్ ఇచ్చిన కస్టమర్ :$16000 tip video.

పాన్‌ ఇండియా చిత్రాల న‌యా ట్రెండ్.. ప్ర‌భాస్‌కూడా అదే బాట‌లో.?రెండు పార్ట్ లుగా ?:Prabhas Salaar movie video.

మూడు చేపలకు పేర్లు పెట్టేందుకు వేలంపాట నిర్వహణ..!4 మిలియన్ డాలర్లు లక్ష్యం :3 beluga whales video.

ఎంతో ఇష్టపడి కొనుకున్న హీరోయిన్ సౌందర్య ఇల్లు..శిధిలావస్థ భూతు బంగ్లా లా తయారైన హౌస్ :Soundarya House video.

Follow us on