నడిరోడ్డుపైనే యువతి, యువకుడు.. కట్చేస్తే కేసు నమోదు.. ఎందుకంటే ??
ఇటీవల యువతలో సోషల్మీడియా క్రేజ్ బాగా పెరిగిపోయింది. నెట్టింట ఎలాగైనా పాపులర్ అవ్వాలనే తాపత్రయంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. మెట్రోరైళ్లలో, రోడ్డుమీద బైక్పైన వెళ్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.
ఇటీవల యువతలో సోషల్మీడియా క్రేజ్ బాగా పెరిగిపోయింది. నెట్టింట ఎలాగైనా పాపులర్ అవ్వాలనే తాపత్రయంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. మెట్రోరైళ్లలో, రోడ్డుమీద బైక్పైన వెళ్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ యువతి, యువకుడు చేసిన పనికి పోలీసులు వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్ర థానే ఉల్లాస్నగర్లోని ఓ సిగ్నల్ వద్ద ఈ విచిత్ర సంఘటన జరిగింది. స్కూటీపై వెళ్తున్న యువతి, యువకుడు నడిరోడ్డుమీద బకెట్తో నీళ్లు తీసుకొని స్కూటీమీద వెళ్తూ స్నానం చేశారు. స్కూటీ వెనక కూర్చున్న యువతి బకెట్లో నీటిని తానూ పోసుకుంటూ.. ఆ యువకుడి మీద పోస్తోంది. దారినపోయేవాళ్లంతా వీళ్ల పిచ్చి వేషాలు చూసి తెగ నవ్వుకున్నారు. అంతేకాదు, అదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారి పోలీసుల కంటపడింది. వీ డిజర్వ్ బెటర్ గవర్నమెంట్ అనే ట్విటర్ హ్యాండిల్ నుంచి ఈ వీడియో థానే నగర పోలీసులకు చేరింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళలకు వాడిపడేసిన కండోమ్ పార్సిళ్లు !! ఎక్కడంటే ??
మొసలి రక్తాన్ని కాఫీలా తాగేస్తున్నాడు !! ఎందుకో తెలిస్తే షాకే
Sarath Babu: ఆస్తులెవరికి ?? భార్యలకా ?? తోబుట్టువులకా ??
Men Too: మెన్ టూ రివ్యూ.. మరీ సినిమా హిట్టా..? ఫట్టా..? తెలియాలి అంటే వీడియో చేసేయండి మరి
కరాటే కళ్యాణీ VS విష్ణు.. ముదురుతున్న లొల్లి..