తాగొచ్చిన కానిస్టేబుల్…స్టేషన్లో ఏం చేశాడో తెలుసా ??

|

Jan 01, 2024 | 3:10 PM

అనంతపురం జిల్లా శింగనమల పోలీస్‌స్టేషన్‌లో షబ్బీర్‌ అనే కానిస్టేబుల్‌ నానా హంగామా సృష్టించాడు. డ్యూటీ సమయంలో మద్యం తాగి ఓ మహిళతోపాటు స్థానికులను అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా వారిపై రాళ్లతో దాడికి యత్నించాడు. తోటి సిబ్బంది ఆయన్ను స్టేషను లోపలికి తీసుకెళ్తున్నా.. మళ్లీ బయటకు వచ్చి బూతులు తిట్టాడు. బాధితులు సీఐకి ఫోన్‌ చేస్తామని చెప్పగా.. ఎవరికి చెప్పుకొంటారో చెప్పుకోండి భయపడేదే లేదన్నాడు.

అనంతపురం జిల్లా శింగనమల పోలీస్‌స్టేషన్‌లో షబ్బీర్‌ అనే కానిస్టేబుల్‌ నానా హంగామా సృష్టించాడు. డ్యూటీ సమయంలో మద్యం తాగి ఓ మహిళతోపాటు స్థానికులను అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా వారిపై రాళ్లతో దాడికి యత్నించాడు. తోటి సిబ్బంది ఆయన్ను స్టేషను లోపలికి తీసుకెళ్తున్నా.. మళ్లీ బయటకు వచ్చి బూతులు తిట్టాడు. బాధితులు సీఐకి ఫోన్‌ చేస్తామని చెప్పగా.. ఎవరికి చెప్పుకొంటారో చెప్పుకోండి భయపడేదే లేదన్నాడు. మీ అంతు చూస్తానని భయాందోళనకు గురి చేశాడు. వ్యక్తం చేశారు. బాధితులు 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్థానిక పోలీసుస్టేషనుకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఇక్కడి సిబ్బంది మాత్రం అలాంటిదేమీ జరగలేదని పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఈ ఘటనను స్థానికులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో మహిళల పట్ల దురుసు ప్రవర్తనపై ఎస్పీ అన్బురాజన్‌ సీరియస్‌ అయ్యారు. ప్రాథమిక విచారణ తర్వాత సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వంతెన కింద ఇరుక్కున్న విమానం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ విశేషాలివే

నదినే రన్‌వేగా పొరబడ్డ పైలట్‌.. దానిపైనే విమానం ల్యాండింగ్

అయోధ్యకు 620 కిలోల గంట.. దానిపై జై శ్రీరామ్ అని రాసి ఉండటం దీని ప్రత్యేకత

భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలు బలోపేతం చేయనున్న భారత్..

 

Follow us on