Operation: ఆపరేషన్‌ చేసి కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్లు.! వీడియో వైరల్..

వైద్యుల నిర్లక్ష్యం మూలంగా ఓ బాలింత నిండు ప్రాణం బలి తీసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి. ఆమెకు ఆగస్టు 15న పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. వైద్యులు ప్రసవం చేయగా మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన రోజున వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు.

Operation: ఆపరేషన్‌ చేసి కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్లు.! వీడియో వైరల్..

|

Updated on: Aug 25, 2023 | 10:13 PM

వైద్యుల నిర్లక్ష్యం మూలంగా ఓ బాలింత నిండు ప్రాణం బలి తీసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి. ఆమెకు ఆగస్టు 15న పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు. వైద్యులు ప్రసవం చేయగా మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన రోజున వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ సమయంలో వైద్యులు కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. డిశ్ఛార్జి అయ్యి ఇంటికి వెళ్లిన బాధితురాలు రోజా తీవ్ర అశ్వస్థతకు గురైంది. ఆపరేషన్‌ నిర్వహించిన వారం రోజుల తర్వాత మహిళకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. పరీక్షించిన ప్రైవేట్‌ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని బంధువులకు సూచించారు. నానాకష్టం మీద హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ బాధితురాలు రోజా మృతి చెందింది. పుట్టిన పిసకందు ఆలనాపాలనా చూసుకోకుండానే తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వైద్యులపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us