సర్కార్ దవాఖానలో జడ్జి ప్రసవం.. ఆదర్శంగా జస్టిస్ షాలిని
ఒకప్పుడు సర్కార్ దవాఖానలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు. ఉన్నత వర్గాలకు చెందినవారైతే ఆ వైపే చూసేవారే కాదు. కానీ, తెలంగాణలో పరిస్థితి మారుతోంది.
ఒకప్పుడు సర్కార్ దవాఖానలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు. ఉన్నత వర్గాలకు చెందినవారైతే ఆ వైపే చూసేవారే కాదు. కానీ, తెలంగాణలో పరిస్థితి మారుతోంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సర్కార్ దవాఖానల్లో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి. ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ దవాఖానల్లో పురుడు పోసుకొనేందుకు ముందుకు వస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ జూనియర్ సివిల్ జడ్జి రాచర్ల షాలిని. వరంగల్ జిల్లా పాపయ్యపేట చమన్ ప్రాంతానికి చెందిన ఆమె ఆర్మూర్ జిల్లా కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ప్రశాంత్ హైదరాబాద్ హయత్నగర్కు చెందిన ఓ కంపెనీలో ప్రాడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. జడ్జి షాలినికి పురుటి నొప్పులు రావడంతో హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన జీఎంహెచ్కు వెళ్లారు. సామాన్య మహిళ మాదిరిగా వచ్చిన ఆమెకు అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికుల బంపర్ ఆఫర్.. గుంజీలు తీస్తే ఫ్రీగా బస్సు టిక్కెట్ !!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

