అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్‌ కప్‌, జాతీయ జెండా

|

Nov 19, 2023 | 8:59 PM

టీమిండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కు చేరడంతో దేశవ్యాప్తంగా క్రీఢాభిమానం వెల్లువెత్తింది. క్రికెట్‌ అభిమానులు భారత్‌ ప్రపంచకప్‌ను గెలవాలని విభిన్న రూపాల్లో తమ అభిమానాన్ని చాటారు. ఈ క్రమంలో ఓ కళాకారుడు బియ్యపు గింజపైన ప్రపంచకప్‌ నమూనాను, జాతీయ జెండాను చిత్రీకరించారు. కర్నూలు జిల్లాకు చెందిన చింతలపల్లె కోటేష్‌ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలను చిత్రీకరిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఫైనల్స్‌ గెలవాలని ఆకాంక్షిస్తూ..

టీమిండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌కు చేరడంతో దేశవ్యాప్తంగా క్రీఢాభిమానం వెల్లువెత్తింది. క్రికెట్‌ అభిమానులు భారత్‌ ప్రపంచకప్‌ను గెలవాలని విభిన్న రూపాల్లో తమ అభిమానాన్ని చాటారు. ఈ క్రమంలో ఓ కళాకారుడు బియ్యపు గింజపైన ప్రపంచకప్‌ నమూనాను, జాతీయ జెండాను చిత్రీకరించారు. కర్నూలు జిల్లాకు చెందిన చింతలపల్లె కోటేష్‌ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలను చిత్రీకరిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఫైనల్స్‌ గెలవాలని ఆకాంక్షిస్తూ బియ్యపుగింజపై వరల్డ్‌ కప్‌ బొమ్మను, భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతేకాదు ప్రపంచం దృష్టి మొత్తం ఈ వరల్డ్‌ కప్‌పైనే ఉందని సూచిస్తూ కన్ను బొమ్మను కూడా అదే బియ్యపు గింజపై చిత్రీకరించారు. ఈ అరుదైన కళాఖండాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అద్భుత కళను ఆవిష్కరించిన కోటేష్‌పై ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వినూత్నంగా అభిమానం చాటుకున్న స్వర్ణకారుడు !! బంగారంతో వరల్డ్‌కప్‌ స్డేడియం

బాలికల హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్‌ !! భయంతో పరుగులు తీసిన విద్యార్ధులు

ఇండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే వైజాగ్‌ బీచ్‌లో స్ట్రీకింగ్‌ చేస్తా !! ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు

గాజా అల్‌–షిఫా ఆస్పత్రిలో మృత్యుఘోష !! ప్రాణాలు కోల్పోతున్న ఐసీయూలోని రోగులు

టెక్ ప్రపంచంలో సంచలనం.. చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు !!

 

Follow us on