చెకింగ్ అంతా పూర్తయి విమానం ఎక్కిన ఓ మహిళా ప్యాసింజర్ను సడన్గా విమానంనుంచి దింపేసారు సిబ్బంది. ఈ సంఘటన ఎయిరిండియా విమానంలో చోటుచేసుకుంది. కేబిన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కారణంగా మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దించేసింది. మార్చి 5వ తేదీన ఢిల్లీ నుంచి లండన్కు వెళుతున్న ఏఐ 161 విమానంలో ప్రముఖ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న మహిళా ప్రయాణికురాలు బిజినెస్ క్లాస్లో టికెట్ కొనుగోలు చేశారు. విమానం టేకాఫ్ అవడానికి ముందు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో పైలట్ సూచన మేరకు ఆమెను దించేశారు. అయితే, హామీ పత్రం తీసుకున్న తర్వాత మరో విమానంలో ఆమెను పింపించినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకావడానికి ఆమె పెట్టిన షరతు ఏంటో తెలుసా ??
ఇకపై షుగర్ టెస్ట్ మరింత ఈజీ.. ఎలా అంటే ??
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై ఆఫీసుకు వెళ్తేనే..
కానిపాకం వినాయకుడితో పోటీపడి పెరుగుతున్న శివుడు !! ఎక్కడంటే ??