Youngman swimming in sea: సముద్రంలో 13 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చాడు.. తీరం చేరగానే..!(వీడియో)
ఓ యువకుడు కుటుంబంతో కలిసి బోటులో సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఆ యువకుడు సముద్రంలోకి దూకేసాడు. ఆ తర్వాత ఏకంగా 13 కి.మీ. సముద్రంలో ఈదుకుంటూ మొత్తానికి తీరం చేరాడు. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్... అదేంటంటే..
ఏమైతేనేం ఆ యువకుడి గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. అతను శ్రీలంకకు చెందినవాడు. కుటుంబంతో కలిసి భారత్లోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో సముద్రంలో బోటులో తమిళనాడుకు బయలుదేరాడు. కొంత దూరం వచ్చాక అతను సముద్రంలోకి దూకేసాడు. అనంతరం 13 కిలోమీటర్లు ఈదుకుంటూ మొత్తానికి తమిళనాడు రామేశ్వరం తీరానికి చేరుకున్నాడు. కానీ, రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పదన్నట్టు.. అతడు అక్రమంగా భారత్లో ప్రవేశించడంతో తీర గస్తీదళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అక్టోబరు 10న అతడిని అదుపులోకి తీసుకున్న కోస్ట్ గార్డ్ అధికారులు అతడి నుంచి గడువు ముగిసిన పాస్పోర్టును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. శ్రీలంకలోని తలైమన్నారుకు చెందిన హసాన్ ఖాన్ అలియాస్ అజయ్ అలియాస్ ఖాన్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి బోటులో వచ్చినట్టు గుర్తించారు. వారితో పాటు మరో వ్యక్తి కూడా వచ్చాడని, అందరినీ రామనాథపురం జిల్లా మండపం క్యాంపునకు తరలించినట్టు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

