Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train: ట్రాక్‌పై దూసుకుపోతున్న రైలు.. ప్లాట్‌ఫాంకి ట్రైన్‌కి మధ్యలో షాకింగ్‌ సీన్‌.. పట్టుకున్న ఆగకుండా..

Train: ట్రాక్‌పై దూసుకుపోతున్న రైలు.. ప్లాట్‌ఫాంకి ట్రైన్‌కి మధ్యలో షాకింగ్‌ సీన్‌.. పట్టుకున్న ఆగకుండా..

Anil kumar poka

|

Updated on: Oct 18, 2022 | 9:57 AM

సిగ్నల్‌ పడటంతో ప్లాట్‌ఫాంమీదనుంచి ట్రైన్‌ కదిలింది.. నెమ్మదిగా వేగం పెరిగింది. ఇంతలో ఓ వ్యక్తి ప్లాట్‌ఫాంపై నడుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కదులుతున్న రైలుకి, ప్లాట్‌ఫాంకి


సిగ్నల్‌ పడటంతో ప్లాట్‌ఫాంమీదనుంచి ట్రైన్‌ కదిలింది.. నెమ్మదిగా వేగం పెరిగింది. ఇంతలో ఓ వ్యక్తి ప్లాట్‌ఫాంపై నడుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కదులుతున్న రైలుకి, ప్లాట్‌ఫాంకి మధ్యలో పడిపోబోయాడు. అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది వెంటనే అలర్ట్‌ అయ్యారు. ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు. కాపాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌లో ఈ ఘ‌ట‌న అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయింది. ఆర్‌పీఎఫ్ ఇండియా ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రమాద‌వ‌శాత్తూ ఫ్లాట్‌ఫాం నుంచి క‌దులుతున్న రైలు కింద‌కు ప‌డిపోతున్న వ్యక్తిని ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ అరుణ్‌జిత్‌, లేడీ హెడ్ కానిస్టేబుల్ పీపీ మిని కాపాడి ఫ్లాట్‌ఫాం పైకి తీసుకువ‌చ్చారు. ట్రైన్ కంపార్ట్‌మెంట్‌, ఫ్లాట్‌ఫాం మ‌ధ్య గ్యాప్‌లో ప్రయాణీకుడు ఇరుక్కుపోవ‌డం ఈ వీడియోలో క‌నిపించింది. అతి క‌ష్టం మీద ఆర్‌పీఎఫ్ సిబ్బంది అతడిని కాపాడారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయ‌త్నించడంతో అతను ప‌డిపోయాడని తెలిపారు. త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్రయాణీకుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్ సిబ్బందిని నెటిజ‌న్లు ప్రశంసించారు. సమయానికి ఆర్పీఎస్‌ సిబ్బంది అక్కడే ఉండటం ఓ కుటుంబాన్ని నిలబెట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 18, 2022 09:11 AM