ఇటీవలి కాలంలో ఏనుగులు అడవుల్లోంచి జనావాసాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటను నష్టం చేయడమే కాకుండా.. స్థానిక ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఒక్కోసారి ప్రజలను చంపేస్తున్నాయి కూడా. ఇకపోతే తాజాగా ఓ ఏనుగుల గుంపు అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ఘాట్ రోడ్డులో నానా రచ్చ చేశాయి. కర్నాటకలోని హసనూర్ ప్రాంతంలో రోడ్డు మీదకు వచ్చిన ఏనుగులు.. ఓ కారును అడ్డగించి ధ్వంసం చేశాయి. తొలత ఏనుగుల గుంపు రోడ్డు మీద రావడంతో చాలా వాహనాలు అలాగే ఓ ఆర్టీసీ బస్సు ఆగిపోయాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన కారును రయ్ అంటూ ఏనుగులను దాటుకోని వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఏనుగులు.. ఆ కారును అడ్డగించి, కారు బ్యానెట్పై తొండంతో దాడి చేశాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన కారులోని ఓ ప్రయాణికుడు కారు దిగి ఏనుగుల నుంచి దూరంగా పరిగెత్తాడు. ఇక ఆ కాసేపటికే ఆ ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..