Kakinada: చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది మత్స్యకారులు.
కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటు నడి సంద్రంలో ఉండగా మంటలు చెలరేగాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. సమీపంలోనే రిలయన్స్ గ్యాస్ టవర్ సెక్యూరిటీ పహారా కాస్తున్నారు. సముద్రంలో మంటలు గమనించిన రిలయన్స్ గ్యాస్ సెక్యూరిటీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మత్స్యకారులను కాపాడారు. భైరవపాలెం, కాకినాడ మధ్య తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాకినాడ తీరంలో వేటకు వెళ్లిన బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటు నడి సంద్రంలో ఉండగా మంటలు చెలరేగాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు. సమీపంలోనే రిలయన్స్ గ్యాస్ టవర్ సెక్యూరిటీ పహారా కాస్తున్నారు. సముద్రంలో మంటలు గమనించిన రిలయన్స్ గ్యాస్ సెక్యూరిటీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మత్స్యకారులను కాపాడారు. భైరవపాలెం, కాకినాడ మధ్య తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లే సమయంలో భోజన అవసరాల కోసం నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ తదితర వస్తువులను వెంట తీసుకెళ్తుంటారు. వేటకు విరామం ఇచ్చే సమయంలో బోటులో వంట చేసుకుని భోజనం చేస్తారు. ఎప్పటిలాగే అలా వెళ్లిన 11 మంది మత్స్యకారులు తిరిగి వస్తుండగా బోటులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. రిలయన్స్ సెక్యూరిటీ సిబ్బంది గమనించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే మత్స్యకారులు మంటల్లో చిక్కుకోవడమో.. లేక వాటి తీవ్రతకు సముద్రంలో దూకి ప్రాణాలు కోల్పోవడమో జరిగేదని అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు..

