Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి అంతా షాక్‌

తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి అంతా షాక్‌

Phani CH
|

Updated on: Jun 13, 2025 | 5:52 PM

Share

తమిళనాడులోని మధురై జిల్లా మేలూరు సమీపంలోని ఉదనపట్టీ గ్రామంలో అద్భుత సంఘటన జరిగింది. ఏప్రిల్ నెలలో జరిగిన సాధారణ తవ్వకాల సందర్భంగా 800 ఏళ్ల నాటి శివాలయం బయటపడింది. ఈ ఆలయం, గత కొన్ని శతాబ్దాలుగా భూమిలోపల దాగి ఉంది. ఈ చారిత్రక ఆలయం బయటపడిన విషయం తెలియడంతో.. దేవి ఆర్కియాలాజికల్ రిసెర్చ్ సెంటర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త అరివుసెల్వం నేతృత్వంలోని శిల్ప విభాగం నిపుణులు సమగ్ర పరిశోధన చేపట్టారు.

వారి అధ్యయనాల్లో ఈ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, ఆవిర్భావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని శిల్పాలు, శాసనాలను పరిశీలించగా.. ఈ ఆలయం మారవర్మన్ సుందర పాండ్యన్-I కాలం నాటిదని.. ముఖ్యంగా 1217-1218 AD మధ్యకాలం నాటిదని నిర్ధారణకు వచ్చారు. శాసనాల్లో ఈ ఆలయానికి ‘తెన్నవన్ ఈశ్వరమ్’ అని పేరు పెట్టినట్లు తేలింది. ఉదనపట్టీ గ్రామాన్ని ఆ కాలంలో ‘అత్తూరు’ అని పిలిచేవారని తేల్చారు. పాండ్యుల రాజవంశపు ప్రత్యేక శైలి ఈ ఆలయ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహాల అమరిక, శిల్పాలు, ఆలచ నిర్మాణశైలి ఆ కాలానికి చెందిన చారిత్రక విశిష్టతను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆలయంలో శివలింగంతో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఈ చారిత్రక ఆలయం గురించి తెలియడంతో.. స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. తమిళనాడు సంపదగా నిలిచిన ఆలయ వారసత్వానికి ఈ శివాలయం మరో ఉదాహరణ అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన జంట.. రాత్రికి రాత్రే

విధి లిఖితం అంటే ఇదే కావచ్చు! ఒక్క రోజు తేడాతో ఈ స్టార్ హీరోల ఇళ్లలో తీవ్ర విషాదం

కనిపించింది కొద్దిసేపే అయినా.. కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా..

చేసిన రచ్చ ఫలితం.. కల్పిక పై పోలీస్‌ కేస్‌

కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్