Viral Video: ఏడేళ్ల చిన్నారికి ప్రపంచ శాంతి ఫొటో అవార్డు.. వీడియో
బెంగళూరుకు చెందిన ఏడేళ్ళ అమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. యునెస్కో అందించే అరుదైన గ్లోబల్ పీస్ ఫొటో అవార్డు ఆధ్యను వరించింది.
బెంగళూరుకు చెందిన ఏడేళ్ళ అమ్మాయికి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. యునెస్కో అందించే అరుదైన గ్లోబల్ పీస్ ఫొటో అవార్డు ఆధ్యను వరించింది. దీంతో 1000 యూరోలతోపాటు ఆస్ట్రియా పార్లమెంట్ను సందర్శించే అరుదైన అవకాశాన్ని ఆ బాలిక దక్కించుకుంది. ఈ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఆధ్య కావడం విశేషం. బెంగళూరు హెబ్బాల్ ప్రాంతంలోని విద్యానికేత్ పాఠశాలలో ఆధ్య రెండో తరగతి చదువుతోంది. తల్లి రోషిణి సెల్ఫోన్తోనే ఆధ్య ఫొటోలు తీసేది. ఆధ్య తీసిన పలు ఫోటోలను సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసే ఆమె తండ్రి పలు ఫొటోగ్రఫీ పోటీలకు పంపించారు. తన తల్లి రోషిణి ఆమె తల్లి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను ఆధ్య సెల్ఫోన్లో బంధించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఏడేళ్ల చిన్నారికి ప్రపంచ శాంతి ఫొటో అవార్డు.. వీడియో
బుర్జ్ ఖలీఫా భవనంపై జాతి పిత మహాత్మగాంధీ ఫోటో.. వీడియో