బస్టాప్లో కనిపించిన అనుమానాస్పద ప్లాస్టిక్ డబ్బా.. ఏంటా అని చెక్ చేయగా అధికారులకు ఫ్యూజులు ఔట్!
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో పిండాల అవశేషాలు కలకలం రేపాయి. ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు.
కర్ణాటకలోని బెలగావి జిల్లాలో పిండాల అవశేషాలు కలకలం రేపాయి. ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు. గుర్తించిన స్థానికులు.. దానిని తెరచి చూడగా అందులో ఏడు పిండాల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వాటిని భ్రూణహత్యలుగా నిర్ధారించారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలల నిండిన శిశువుల పిండాలని గుర్తించారు. కాగా, ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ పిండాలని దవాఖానలో భద్రపరిచామని అధికారులు వెల్లడించారు. వాటిని పరీక్షల నిమిత్తం జిల్లా ఫంక్షనల్ సైన్స్ సెంటర్కు పంపిస్తామన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందుకే పనస పండు తినాలంటారు.. బీపీ నుంచి రక్తహీనత వరకు.. ఎన్నో సమస్యలకు..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

