66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా
వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా షురూ అయ్యాయి. బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతోంది. వినాయక వేడుకల్లో ముంబయిలోని ప్రముఖ జీఎస్బీ సేవా మండల్ వారి మహాగణపతి ప్రతీఏటా ప్రత్యేకంగా నిలుస్తున్నది.
వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా షురూ అయ్యాయి. బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతోంది. వినాయక వేడుకల్లో ముంబయిలోని ప్రముఖ జీఎస్బీ సేవా మండల్ వారి మహాగణపతి ప్రతీఏటా ప్రత్యేకంగా నిలుస్తున్నది. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా 400 కోట్ల రూపాయలతో బీమా చేయించారట. ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించడమే ఇందుక్కారణం. ముంబయి శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ మండపంలోని గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. దీంతో ముందుజాగ్రత్తగా ఈ వేడుకలకు 400.58 కోట్ల రూపాయలతో బీమా చేయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సెప్టెంబరు 11 వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దొంగ.. వినాయక చవితి రోజే గణేశుడి లడ్డూ కొట్టేశాడు !!
కిస్మిస్ గణపతి.. బాదం గణపతి.. ఆకట్టుకుంటున్న గణనాధులు
7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

