66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా
వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా షురూ అయ్యాయి. బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతోంది. వినాయక వేడుకల్లో ముంబయిలోని ప్రముఖ జీఎస్బీ సేవా మండల్ వారి మహాగణపతి ప్రతీఏటా ప్రత్యేకంగా నిలుస్తున్నది.
వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా షురూ అయ్యాయి. బొజ్జ గణపయ్య కోసం ఊరూరా, వాడవాడలా అందమైన మండపాలను ఏర్పాటు చేశారు. వివిధ రూపాల్లో లంబోదరుడి ప్రతిమలతో ప్రతి వీధి కళకళలాడుతోంది. వినాయక వేడుకల్లో ముంబయిలోని ప్రముఖ జీఎస్బీ సేవా మండల్ వారి మహాగణపతి ప్రతీఏటా ప్రత్యేకంగా నిలుస్తున్నది. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా 400 కోట్ల రూపాయలతో బీమా చేయించారట. ఇక్కడి విగ్రహాన్ని భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించడమే ఇందుక్కారణం. ముంబయి శివారులోని మతుంగా ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జీఎస్బీ సేవామండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈసారి 70వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ మండపంలోని గణపయ్య విగ్రహాన్ని ఏకంగా 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు. దీంతో ముందుజాగ్రత్తగా ఈ వేడుకలకు 400.58 కోట్ల రూపాయలతో బీమా చేయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సెప్టెంబరు 11 వరకు ఐదు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దొంగ.. వినాయక చవితి రోజే గణేశుడి లడ్డూ కొట్టేశాడు !!
కిస్మిస్ గణపతి.. బాదం గణపతి.. ఆకట్టుకుంటున్న గణనాధులు
7 కోట్ల ఏళ్ల క్రితం అంబర్ శిలాజం !! ఇంటి మెట్టుగా వాడుకున్న బామ్మ !!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

