అక్కడ పూజారి ఒక్క తన్ను తన్నితే చాలు.. అన్ని పాపాలూ హరీ !!

|

Apr 15, 2023 | 9:41 AM

కర్నూలు జిల్లా చిన్న హోతూరు గ్రామంలో శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి రథోత్సవాలు ప్రతి యేటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరి రోజు ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం జరుగుతుంది.

కర్నూలు జిల్లా చిన్న హోతూరు గ్రామంలో శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి రథోత్సవాలు ప్రతి యేటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరి రోజు ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం జరుగుతుంది. ప్రతి ఏటా కర్ణాటకలోని హంపీ విరూపాక్ష స్వామి రథోత్సవాల మాదిరిగా చిన్న హోతూరులో కూడా మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి నిర్వహించేవారని భక్తుల నమ్మకం. నాటి ఉత్సవాల చివరి రోజున శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి శివపార్వతుల కల్యాణం జరిపించేవారని ఆలయ చరిత్రలో ఉన్నట్టు భక్తులు చెబుతున్నారు. అయితే..కల్యాణ సమయంలో భక్తులు కొన్ని తప్పులు చేయడంతో శివుడి కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆలయ పూజారీ రూపంలో ఆయన గుడిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్టు ఆలయ చరిత్రలో ఉంది. అలా స్వామిచే తన్నులు తిన్న వారికి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: దసరా దెబ్బకు రెమ్యూనరేషన్ పెంచేసిన నాని

Allu Arjun: ఇది బ్రాండ్‌ అంటే !! త్రూ అవుట్ ఇండియా పుష్ప రాజ్ హవా..

Salaar: గెట్ రెడీ.. సలార్ టీజర్‌ వచ్చేస్తోంది

Allu Arjun: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ రేసులో బెస్ట్ హీరోగా అల్లు అర్జున్

పిల్లలు కాదు పిడుగులు.. ఈ వీడియో చూస్తే గుండె జారిపోవడం ఖాయం

Follow us on