Viral Video: పురాతన శివాలయంలో అద్భుతం.. తవ్వకాల్లో 22 పంచలోహ దేవతా విగ్రహాలు..
తమిళనాడులోని ఓ పురాతన శివాలయంలో పెద్ద సంఖ్యలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటీ రెండు కాదు. ఏకంగా 22 విగ్రహాలు ఆలయంలోని తవ్వకాల్లో బయటపడ్డాయి. మైలాడుదురై జిల్లాలోని శీర్గాళిలో చటగట్నాథన్ దేవాలయంలో
తమిళనాడులోని ఓ పురాతన శివాలయంలో పెద్ద సంఖ్యలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటీ రెండు కాదు. ఏకంగా 22 విగ్రహాలు ఆలయంలోని తవ్వకాల్లో బయటపడ్డాయి. మైలాడుదురై జిల్లాలోని శీర్గాళిలో చటగట్నాథన్ దేవాలయంలో మూడు దశాబ్దాల తర్వాత కుంభాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అందులో భాగంగా యాగశాలకోసం దేవాలయంలోని ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. యాగశాల కోసం ఆలయంలోపల తవ్వకాలు జరుపుతుండగా ఏకంగా 22 దేవతా మూర్తుల విగ్రహాలు బయటపడ్డంతో అంతా ఆశ్చర్యపోయారు. 30 ఏళ్ళ తరువాత తలపెట్టిన కుంభాభిషేకానికి ఆలయంలో మరమ్మతుల కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలన్నీ పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలే కావడం విశేషం. అంతేకాదు… విగ్రహాలన్నీ రెండడుగుల ఎత్తులోనే ఉన్నాయి. వీటికి తోడు వందలకొద్దీ రాగిరేకులు, ఇతర పూజాసామాగ్రి తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ విగ్రహాల గురించి పురావస్తు శాఖకు సమాచారమిచ్చారు ఆలయ అధికారులు. ఈ పురాతన శివాలయంలో బయపటడ్డ విగ్రహాలు ఏకాలానికి చెందినవో.. వాటి చరిత్ర ఏమిటో తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

