Tungabhadra: పగిలిన తుంగభద్ర పైప్లైన్.. 50 ఎకరాల్లో నీట మునిగిన పంట!
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పైప్లైన్ లీక్ కావడంతో రెండు రోజుల నుంచి నీరు వృధాగా పోతోంది. దీని కారణంగా దాదాపు 50 ఎకరాల వరకు పంట నీట మునిగింది. నీట్లో పత్తిపంట మునిగిపోయింది. దీంతో రైతులు ఆందోళన
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పైప్లైన్ లీక్ కావడంతో రెండు రోజుల నుంచి నీరు వృధాగా పోతోంది. దీని కారణంగా దాదాపు 50 ఎకరాల వరకు పంట నీట మునిగింది. నీట్లో పత్తిపంట మునిగిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోస్గి మండలం సాతనూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. పులికనుమ పంప్హౌస్ పైప్లైన్ పగిలి రెండు రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్ధానికులు, రైతులు మండిపడుతున్నారు. పగిలిపోయిన పైప్లైన్ను బాగు చేయించాలని కోరుతున్నారు. ఈ పైపులైన్ పగిలిపోవడంతో భారీ ఎత్తున నీరు పొలాల్లోకి ప్రవహిస్తోంది. దీంతో తీవ్ర పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

